ఎన్నిసార్లు చూసిన ఇప్పటికీ కొత్తగానే ఉంటుంది.. వర్షం సినిమాపై త్రిష కామెంట్స్?

తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న హీరో ప్రభాస్ వర్షం సినిమా ద్వారా మంచి హిట్ అందుకొని టాలీవుడ్ స్టార్ హీరోల జాబితాలో చేరాడు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన త్రిష నటించి సందడి చేశారు. ఈ సినిమా ద్వారా ఈ జోడి ఎంతో గుర్తింపు పొందడంతో తదుపరి సినిమాలలో కూడా వీరిద్దరు కలిసి జంటగా నటించారు.ఇకపోతే ఈ సినిమా విడుదలై 18 సంవత్సరాలు పూర్తి కావడంతో తిరిగి ఈ సినిమాని థియేటర్లలో విడుదల చేశారు.

ఈ విధంగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కావడంతో ప్రభాస్ అభిమానులు ఈ సినిమాకి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ పెద్ద ఎత్తున హంగామా చేస్తున్నారు. అయితే ప్రభాస్ అభిమానులు ఎవరూ కూడా త్రిష గురించి పట్టించుకోకపోవడంతో స్వయంగా త్రిష ఈ సినిమా గురించి సోషల్ మీడియా వేదికగా ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. ప్రస్తుతం త్రిష షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వర్షం సినిమా గురించి ఈమె సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ..ఈ సినిమా విడుదలై 18 సంవత్సరాలు పూర్తయింది నాకైతే కొత్తగా ఈ సినిమా విడుదలైన భావన కలుగుతుంది కొన్ని సినిమాలు చిరకాలంగా అలాగే నిలిచిపోతాయి అంటూ త్రిష చెప్పుకొచ్చారు. అలాంటి సినిమాలలో వర్షం సినిమా ఒకటి అని ఈ సినిమాని ఎన్నిసార్లు చూశానో లెక్కలేదు.. చూసిన ప్రతిసారి ఈ సినిమా కొత్తగానే ఉంటుందనీ,తన సినీ కెరియర్లు ఇంత ఎదిగినందుకు సంతోషంగా ఉందని మీ అభిమానమే నన్ను స్థాయిలో నిలబెట్టింది అంటూ త్రిష వర్షం సినిమా గురించి షేర్ చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది.