వేలానికి సుడిగాలి సుదీర్… మరి సుధీర్ ను కొనేది ఎవరు?

బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సుడిగాలి సుధీర్ ఒకరు. జబర్దస్త్ కార్యక్రమంలో తన కంటే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సుదీర్ ఈటీవీలో ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.ఈ కార్యక్రమంలో కూడా జబర్దస్త్ టీం పాటిస్పేట్ చేస్తున్నప్పటికీ జబర్దస్త్ మాదిరిగా కాకుండా సరికొత్తగా షో ప్లాన్ చేసి అద్భుతమైన రేటింగ్ కైవసం చేసుకుంటుంది.

ఇక ఈ కార్యక్రమానికి ప్రతి వారం గెస్ట్ లను ఆహ్వానించి వారి ముందు కమెడియన్స్ స్కిట్ లు చేస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇక ఈ కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా ఇంద్రజ వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ వారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో నిర్వాహకులు విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా సుడిగాలి సుదీర్ తనకుతానే వేలానికి పెట్టుకున్నారు.ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో కంటెస్టెంట్ లకు శాలరీ ఇవ్వడానికి డబ్బులు లేకపోవడంతో ఈ వేలం నిర్వహిస్తామని ఇంద్రజతో చెప్పినట్లు తెలుస్తోంది.

స్కిట్ లో భాగంగా సుడిగాలి సుదీర్ ఒక సంవత్సరం పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ,తనని లీజుకు ఇస్తామని లీజుకు ఇవ్వడం వల్ల వచ్చిన డబ్బుతో కంటెస్టెంట్ లకు శాలరీ ఇవ్వొచ్చని ప్రకటించారు. ఇకపోతే సుదీర్ ను వేలానికి పెట్టడంతో ఆయనని కొనేవారు ఎవరు అంటూ ప్రశ్నించారు. ఈ విధంగా సుడిగాలి సుదీర్ వేలానికి పెట్టడంతో తనని కొనడానికి అక్కడున్న వారందరినీ వేదికపైకి పిలవగా వెంటనే వర్ష కలగజేసుకుని సూపర్… సూపర్ అన్నందుకేనా ఇదంతా చేస్తున్నారంటూ సుడిగాలి సుధీర్‌పై వ‌ర్ష పంచ్ వేసింది. మొత్తానికి ఈ కార్యక్రమం ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని అందిస్తుంది. మరి వేలంపాటలో సుడిగాలి సుదీర్ ను ఎవరు కొన్నారు? ఎంతకు కొన్నారనే విషయం తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు వేచి చూడాలి.