అలాంటి క్షణాలు మళ్లీ రావు: సాయి పల్లవి

నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ఫిదా సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతగానో అభిమానులను సందడి చేశారు. మొదటి సినిమాతోనే ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న సాయి పల్లవికి అనంతరం వరుస సినిమాలలో నటించే అవకాశం వచ్చింది.తాను ఎంపిక చేసుకొని సినిమాలలో ఎక్కడ గ్లామర్ షో చేయకుండా ఎంతో హుందాగా ఒంటినిండా దుస్తులు ధరిస్తూ సినిమాలలో నటించినప్పటికీ ఈమెకు విపరీతమైన చెప్పాలి. ఇలా సినిమాల పరంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న సాయి పల్లవి తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేశారు.

ఈ క్రమంలోనే తాజాగా జరిగిన ఫిలింఫేర్ అవార్డు కార్యక్రమంలో భాగంగా సాయిపల్లవి కూడా ఏకంగా రెండు ఫీలింఫేర్ అవార్డులో వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ ఫిలింఫేర్ అవార్డుల గురించి ఈమె ప్రస్తావిస్తూ చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ ఏడాది సాయి పల్లవి నటించిన లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ సినిమాకు గాను ఉత్తమ నటిగా రెండు ఫిలింఫేర్ అవార్డులను అందుకున్నారు. ఈ క్రమంలోనే ఈ విషయం గురించి చర్చిస్తూ జీవితంలో ఇలాంటి రోజులు తరచూ రావు.. ఒకే ఏడాది రెండు సినిమాలకు ఈ విధమైనటువంటి ప్రశంసలు అందుకోవడం చాలా ప్రత్యేకం.

ఇలాంటి పాత్రలలో నటించి నేను పొందిన అపారమైన ప్రేమకు ఎల్లప్పుడూ కృతజ్ఞురాలిని. ఈ విధమైనటువంటి అందమైన పాత్రలు మరెన్నో రావాలని ప్రార్థిస్తున్నాను అంటూ సాయి పల్లవి చేస్తున్నటువంటి ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే ఒకేసారి రెండు ఫిలింఫేర్ అవార్డులను అందుకోవడంతో సాయి పల్లవి సంతోషం వ్యక్తం చేయగా అభిమానుల సైతం సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇకపోతే సాయి పల్లవి విరాటపర్వం గార్గి సినిమా తర్వాత ఎలాంటి సినిమాలను ప్రకటించలేదు.