“గుంటూరు కారం”లో పూజా ని తీసేయమంది ఎవరంటే.?

లేటెస్ట్ గా టాలీవుడ్ సినిమా దగ్గర హాట్ టాపిక్ గా మారుతున్నా లేటెస్ట్ చిత్రం “గుంటూరు కారం”. దర్శకుడు త్రివికం అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో మూడో సినిమా ఇది కావడంతో భారీ అంచనాలు ఈ సినిమాపై నెలకొన్నాయి.

ఇక ఈ చిత్రం నుంచి అయితే థమన్ ని పూజా హెగ్డే ని తీసేసారు అని రూమర్స్ రాగ నిర్మాత నాగవంశీ అయితే పూజా వరకు క్లారిటీ ఇచ్చి తమ సినిమాకి థమన్ వర్క్ చేస్తున్నాడు అని కన్ఫర్మ్ చేశారు. ఇక ఇదిలా ఉండగా అసలు మెయిన్ హీరోయిన్ అయ్యిన పూజా హెగ్డే ని తీసేయడం చాలా మందికి ఒకింత షాకింగ్ గా మారింది.

అయితే అసలుకే పూజా హెగ్డే ని తీసేయమని సజెస్ట్ చేసిందే మహేష్ బాబు అని సినీ వర్గాలు చెప్తున్నాయి. పూజా నే కాకుండా థమన్ ని కూడా తప్పించాలని మహేష్ కోరాడు అని కానీ త్రివిక్రమ్ అయితే ఇద్దరినీ ఉంచేలా కన్విన్స్ చేస్తున్నాడు కానీ లాస్ట్ కి అయితే పూజా ని మాత్రం తప్పించారని రూమర్స్ వినిపిస్తున్నాయి.

దీనితో పూజా హెగ్డే స్కిప్పింగ్ వెనుక మహేష్ పేరే ఉందని టాక్. ఇక ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలి. కాగా ఈ చిత్రంలో అయితే ఇప్పుడు అయితే శ్రీ లీలనే మెయిన్ హీరోయిన్ ప్లేస్ తీసుకున్నారు అని అంటున్నారు. ఇక వీటి అన్నింటిపై ఒక క్లారిటీ కోసం అయితే ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు.