కృష్ణ మరణం ముందు రోజు జరిగింది ఇదే.. అసలు విషయం చెప్పిన సోదరుడు?

సూపర్ స్టార్ కృష్ణ నవంబర్ 15వ తేదీ తెల్లవారుజామున తుది శ్వాస విడిచిన విషయం మనకు తెలిసిందే. ఇలా ఈయన మరణించడంతో ఈయనకు సంబంధించిన ఏదో ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే కృష్ణ గారు మరణించడానికి ముందు ఏం జరిగింది అనే విషయాల గురించి కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు ఓ ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించారు. ఈ సందర్భంగా ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ తాను ఆదివారం ఉదయం కృష్ణ గారిని కలిసానని ఇలా మేమిద్దరం కలిసినప్పుడు ఆయన చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసుకొని ఎంతో సంతోషంగా నవ్వారు అని తెలిపారు.

ఈ విధంగా తాను అన్నయ్యను కలిసి మాట్లాడినప్పుడు తనలో ఏ విధమైనటువంటి అనారోగ్య లక్షణాలు కనిపించలేదని ఈయన తెలిపారు. ఈ విధంగా తనతో కాసేపు మాట్లాడుతూ ఉండగా అన్నయ్య భోజనం చేసి వెళ్లమని చెప్పారు. అయితే తన ఇంటికి ఇతరులు భోజనానికి వస్తున్నారని చెప్పి తర్వాత వస్తా అని అక్కడి నుంచి వెళ్లాను.అర్ధరాత్రి ఆదివారం 12:30 సమయంలో అన్నయ్య గారిని చూసుకొని ఒక అబ్బాయి తనకు ఫోన్ చేసి ఆయన పల్స్ ఏదో తేడాగా ఉంది అంటూ చెప్పారు వెంటనే తనని హాస్పిటల్ కి తీసుకెళ్లమని చెప్పి నేను కూడా అక్కడికి వెళ్లాను.

అన్నయ్య గదిలో నుంచి గురక శబ్దం రాకపోవడంతో అది గమనించిన అతను పల్స్ చెక్ చేశారు.అప్పటికే అన్నయ్యకు గుండెపోటు వచ్చి 30 నిమిషాలు అయిందని అలా గుండెపోటు రావడం వల్ల ఆ ప్రభావం ఇతర భాగాల పై పడి ఇతర భాగాలు కూడా ఫెయిల్యూర్ అయ్యాయని రక్తప్రసరణ కూడా ఆగిపోయింది అంటూ ఈ సందర్భంగా ఆదిశేషగిరిరావు తెలిపారు. డాక్టర్లు ఎంతో కష్టపడినప్పటికీ తన బాడీ సహకరించకపోవడంతో వైద్యులు కూడా ట్రీట్మెంట్ ఆపివేశారని ఈయన తెలిపారు.ఇలా కృష్ణ మరణానికి ముందు జరిగిన ఈ విషయాలను ఆదిశేషగిరిరావు తెలియజేయడంతో ప్రస్తుతం ఈ విషయాలు వైరల్ అవుతున్నాయి.