నటి రమాప్రభకు రాజేంద్రప్రసాద్ ఏమవుతారో తెలుసా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని నాగేశ్వరరావు ఎన్టీఆర్ వంటి వారు హీరోలుగా కొనసాగుతున్న సమయంలో హీరోయిన్ గా రమాప్రభ ఎంట్రీ ఇచ్చారు. ఈమె హీరోయిన్ గా మాత్రమే కాకుండా పలు సినిమాలలో కీలక పాత్రలో నటించి మంచి గుర్తింపు పొందారు. ఈ విధంగా ఇండస్ట్రీలో సీనియర్ నటిగా గుర్తింపు సంపాదించుకున్న నటి రమాప్రభకు మరొక నటుడు, నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ బంధువు అని మీకు తెలుసా. ఇలా రమాప్రభ, రాజేంద్ర ప్రసాద్ మధ్య ఎలాంటి రిలేషన్ ఉంది అనే విషయానికి వస్తే…

రాజేంద్రప్రసాద్ సొంత ఊరు కృష్ణా జిల్లా నిమ్మకూరు గ్రామం. అయితే ఎన్టీఆర్ సొంత గ్రామం కూడా ఇదే కావడం విశేషం. ఈ విధంగా ఎన్టీఆర్ ఇండస్ట్రీలో గొప్ప నటుడిగా ఉండగా అతనిని ప్రేరణగా తీసుకొని రాజేంద్ర ప్రసాద్ కూడా ఇండస్ట్రీలోకి వచ్చారు. ఈ విధంగా కెరియర్ మొదట్లో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మిమిక్రీ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందిన రాజేంద్రప్రసాద్ అనంతరం ఎన్నో చిత్రాలలో నటించారు. ఇలా హీరోగా ఇండస్ట్రీలో స్థిరపడిన రాజేంద్రప్రసాద్ కి నటి రమాప్రభ మధ్య బంధుత్వం ఉంది.

రమాప్రభ శరత్ బాబుని వివాహం చేసుకున్న తర్వాత ఆమెకు పిల్లలు లేరు. అయితే తన సోదరి కుమార్తె చాముండేశ్వరిని రమాప్రభ పెంచుకున్నారు. అయితే రమాప్రభ తన సోదరి కుమార్తె చాముండేశ్వరిని హీరో రాజేంద్రప్రసాద్ కు ఇచ్చి వివాహం చేశారు. ఇలా తన కూతురిని ఇచ్చి పెళ్ళి చేయటం వల్ల వీరిద్దరి మధ్య బంధుత్వం ఏర్పడింది. ఇక అప్పటి నుంచి రాజేంద్ర ప్రసాద్ రమాప్రభ కుటుంబానికి మద్దతుగా నిలబడి ఆమె కుటుంబ బాధ్యతలను రాజేంద్రప్రసాద్ తీసుకున్నారు. ప్రస్తుతం రమాప్రభ వయసు పైబడటం ఈమె ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ మదనపల్లెలో నివసిస్తున్నారు.