షాకింగ్ : ఇజ్రాయిల్ లో తప్పిపోయిన “ఛత్రపతి” హీరోయిన్ ..!

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కూడా ప్రతి మనిషి లైఫ్ లోను ఎంటర్టైన్మెంట్ అయితే తప్పనిసరిగా మారిపోయింది. కానీ ఈ ఎంటర్టైన్మెంట్ కన్నా పర్శనల్ లైఫ్ అనేది కూడా ఎంతో ముఖ్యం అది బాగుంటేనే మిగతా అన్నీ బావుంటాయి. అయితే ప్రతి మనిషి ఉండే దేశం వాటి వ్యవస్థలు ఓ దేశంతో సత్సంబంధాలు ఇలా అన్నీ ఉంటాయి అలాగే యుద్ధాలు కూడా ఉంటాయి.

కానీ ఇప్పుడు మన ఇండియా సహా కొన్ని దేశాల్లో మినహా పరిస్థితులు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. ఇపుడు అలాంటి పరిస్థితే ఊహించని విధంగా బాలీవూడ్ హీరోయిన్ కి షాకిచ్చింది. బాలీవుడ్ కి చెందిన ప్రముఖ నటి నుష్రట్ భరూచా తాను నటించిన ఓ సినిమా ప్రమోషన్ కోసం అని ఇజ్రాయిల్ కి వెళ్ళింది.

అంతే కాకుండా అక్కడ ఒక గ్రాండ్ ఫిల్మ్ ఫెస్టివల్ కూడా ఉంటే అందులో ఆమె లైవ్ పెర్ఫామెన్స్ ఇవ్వాల్సి ఇది. అయితే తీరా అక్కడికి వెళ్ళాక ఇజ్రాయిల్ పై సడెన్ బాంబు దాడులు జరగడం కలకలం జరిగింది. దీనితో ఇజ్రాయిల్ లో ఈ హీరోయిన్ ఆచూకీ కాసేపు మిస్ అవ్వడం షాకింగ్ గా మారింది.

అంతే కాకుండా తన సిబ్బంది నుంచి కూడా ఎలాంటి కాంటాక్ట్ లేకపోవడంతో మరింత టెన్షన్ వాతావరణం నెలకొంది కానీ ఫైనల్ గా అయితే ఆమెకి అక్కడ ఎయిర్ లైన్స్ నుంచి ఇండియాకి వెళ్లే విమానంలో చోటు దక్కింది అని దీనితో ఆమె ఇండియాకి రిటర్న్ అయ్యారు అని లాస్ట్ మినిట్ లో తెలిసింది. దీనితో ఈ వార్త ఇప్పుడు సినీ వర్గాల్లో సంచలనంగా మారింది. కాగా ఈ హీరోయిన్ అయితే రీసెంట్ గా బాలీవుడ్ లో హిందీ “ఛత్రపతి” లో నటించింది.