పుష్ప 2 ప్రమోషనల్ ఈవెంట్స్ లో భాగంగా దేశం మొత్తం తిరుగుతున్న మూవీ టీం సోమవారం హైదరాబాద్ యూసఫ్ గూడా లోని పోలీస్ గ్రౌండ్ లో ఈవెంట్ ఆర్గనైజ్ చేశారు. ఈ ఈవెంట్ కి రాజమౌళి ముఖ్యఅతిథిగా వచ్చారు. ఈ సినిమాకి సంబంధించిన ప్రముఖులందరూ సినిమాతో వారికున్న అనుబంధాన్ని పంచుకున్నారు.
అలాగే అల్లు అర్జున్ కూడా స్టేజ్ పై మాట్లాడుతూ అల్లు అర్జున్ అనే వాడు ఉన్నాడు అంటే అందుకు కారణం డైరెక్టర్ సుకుమార్, అతను లేకపోతే నేను మీ ముందు ఉండేవాడిని కాదు. పుష్ప 2 బిగ్గెస్ట్ ఇండియన్ సినిమా అయిందంటే కారణం మీ ఆదరణ, ప్రేక్షకులకి ఒక బెస్ట్ గిఫ్ట్ ఇవ్వాలి, గొప్ప ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అని చేసిన సినిమా ఇది అని చెప్పుకొచ్చాడు బన్నీ. అలా మాట్లాడుతూ ఉండగానే ఒక అభిమాని స్టేజ్ మీదకి దూసుకు వచ్చేసాడు.
అది గమనించిన బౌన్సర్లు అతనిని పట్టుకొని పక్కకి నెట్టేస్తూ ఉంటే అన్నా..ఒక ఫోటో అని అరుస్తున్న అభిమానిని చూసి బౌన్సర్లని ఆగమని చెప్పి అభిమానికి సెల్ఫీ ఇచ్చి పంపించాడు. అతను జై బన్నీ, జై జై బన్నీ అంటూ ఆనందంగా కిందికి దిగి వెళ్లిపోయాడు. తర్వాత బన్నీ మళ్ళీ మాట్లాడుతూ అభిమానులు అంటే నాకు చాలా పిచ్చి, లవ్ యు, లవ్ యు అంటూ అభిమానులకి థాంక్స్ చెప్పాడు కానీ ఇలాంటివి మళ్లీ చేయకండి ప్లీజ్ తన అభిమానులని రిక్వెస్ట్ చేశాడు.
పుష్ప సినిమా పై మీరందరూ చూపిస్తున్న ఆదరణకు రుణపడి ఉంటాను. మూడేళ్ల క్రితం ఇలా ఫంక్షన్ చేసినప్పుడు మీరందరూ వచ్చారు, మళ్ళీ ఇప్పుడు మా సొంత ఫంక్షన్ లో మీ అందరినీ కలిసినట్లు అనిపిస్తుంది అని అభిమానులని పొగిడేసిన అల్లు అర్జున్ ఆ తర్వాత నిర్మాతలకి కూడా కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. ఖర్చు విషయంలో మైత్రి మేకర్స్ నిర్మాతలు ఎక్కడ రాజీ పడలేదు మమ్మల్ని నమ్మి ఈ సినిమా మీద కోట్లు కుమ్మరించినందుకు థాంక్స్ అని చెప్పాడు.

