టాలీవుడ్ కంటే బాలీవుడ్ లోనే మంచి అవకాశాలు వచ్చాయి.. షాకింగ్ కామెంట్స్ చేసిన తాప్సి?

టాలీవుడ్ హీరోయిన్ సొట్ట బుగ్గల సుందరి అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చే బ్యూటీ తాప్సీ పన్ను. మొదట ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది తాప్సి. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న తాప్సి తన అందం అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. మొదటి సినిమా మంచి హిట్ అవడంతో ఈమెకు తెలుగులో వరుసగా అవకాశాలు లభించినప్పటికీ ఈమెకు హీరోయిన్ గా తగిన గుర్తింపు దక్కలేదు. అయితే ఈమె తెలుగులో పలు సినిమాలలో నటించినప్పటికీ ఈమెకు తగిన గుర్తింపు దక్కకపోవడంతో బాలీవుడ్ కి చెక్కేసింది.

ఆ తర్వాత మళ్లీ టాలీవుడ్ వైపు చూడకుండా బాలీవుడ్ లో వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది తాప్సి. ఇది ఇలా ఉంటే తాజాగా తాప్సీ టాలీవుడ్ ఇండస్ట్రీపై చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా తాప్సీ మాట్లాడుతూ.. నేను ఏ విషయం అయినా మంచి చెడులు తెలుసుకొని మాట్లాడుతాను. నా తత్వాన్ని అర్థం చేసుకోలేకపోతే ముక్కుసూటిగా పొగరుగా కామెంట్స్ చేస్తానని చాలా విమర్శిస్తారు. కానీ అటువంటి మాటలు నేను లెక్క చేయను.. చెప్పాల్సింది ఏదైనా ఉంటే ముఖం మీద చెప్పేస్తాను. ఎవరికోసమో నా అభిప్రాయాలు కూడా నేను మార్చుకోను. నాకు నచ్చినట్టు ఉండటమే నాకు ఇష్టం.

కెరియర్ మొదట్లో కథలు ఎంపిక విషయంలో కాస్త తడబడ్డాను కానీ ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించి సినిమాలకు సైన్ చేస్తున్నాను. ఒక సినిమాకు సైన్ చేస్తున్నప్పుడు ఆ పాత్ర మనకు సూట్ అవుతుందా లేదా అన్నది నిర్ధారించుకున్న తర్వాతనే ఒక నిర్ణయం తీసుకోవాలి.. సినిమా పూర్తి అయిన తర్వాత తీరిగ్గా ఆలోచిస్తే ఫలితం తారుమారు అవుతుంది.. అలాగే టాలీవుడ్ తో పోల్చుకుంటే బాలీవుడ్ లో నాకు సరిపోయే పాత్రలు వచ్చాయి. బాలీవుడ్ నాకు మంచి మంచి పాత్ర లభించాయి అని చెప్పుకొచ్చింది తాప్సి.