Rashmika Mandana: ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా ఓకే చేయడానికి కారణం అదే: రష్మిక

Rashmika Mandana: రష్మిక మందన ఇప్పుడు నేషనల్ క్రష్ గా బాగా పాపులర్. ఈ కన్నడ ముద్దు గుమ్మా ఛలో సినిమాతో నాగశౌర్యా సరసన నటించి ఈ సినిమా విజయంతో వెను తిరిగి చూసుకునే పనిలేకుండా అయింది. తర్వాత విజయ్ దేవరకొండతో గీతాగోవిందం సినిమాతో నటనకు మంచి మార్కులే తెచ్చుకుంది. తర్వాత వచ్చిన సరిలేరు నీకెవ్వరు, భీష్మ సినిమాలతో టాప్ హీరోయిన్ అయిపోయింది.రీసెంట్ గా వచ్చిన పుష్పతో ఆల్ ఇండియా లెవెల్ లో ఫ్యాన్ డమ్ పెంచుకుంది.

పుష్ప సినిమా తర్వాత రష్మిక హీరోయిన్ గా వస్తున్న చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు, శర్వానంద్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం మార్చి 4న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ ”కిశోర్‌ గారు కథ చెబుతున్నప్పుడు ఇంట్రవెల్‌ సీన్‌ బాగా నచ్చింది. ఆ సీన్‌ విన్న వెంటనే ఈ సినిమాకు ‘ఓకే’చెప్పానని ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె వెల్లడించారు. చాలా సరదాగా ఉండే సీన్‌ అది సినిమా అంతా అలానే ఉంటుందని రష్మిక ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు.

“ఓ సినిమాలో ఇంతమంది ఆడవాళ్లు నటించడం ఈమధ్యకాలంలో ఇదే తొలిసారి. అందరూ పేరున్న నటీమణులే. వాళ్లందరితో కలిసి నటించడం గొప్ప అనుభూతినిచ్చింద”న్నారు రష్మిక. ఈ సినిమాలోని పాత్రలను చాలా హుందాగా ఉంటాయి. పుష్ప సినిమా జరిగేటప్పుడు సమాంతరంగా ఈ సినిమా షూటింగ్ జరిగింది, ఈ సినిమా చిత్రీకరణ వచ్చినప్పుడు సరదా సరదాగా ఒక పిక్నిక్ కి వచ్చిన భావన కలిగేది. రోజు శర్వానంద్ గారి ఇంటి నుంచి భోజనం కూడా వచ్చేది, ఆయన కూడా చాలా సరదాగా ఉండేవారు. అని చెప్పుకొచ్చింది.

ఇక దేవిశ్రీ ప్రసాద్ మంచి సంగీతం అందించారు అని పాటలు చాలా బాగా వచ్చాయి అని చెప్పింది. ఇక పెళ్లి గురించి వస్తున్న వార్తలపై స్పందిస్తూ, ‘టైమ్‌ పాస్‌ కోసం అలాంటివి రాస్తుంటారు. నేను నవ్వి ఊరుకుంటానంతే. ప్రేమ, పెళ్లి లాంటి విషయాలకు నా దగ్గర సమయం లేదని”, కొట్టిపడేశారు. ఈ సినిమాతో ఎలాంటి ఇమేజ్ సంపాదించుకుంటుంది అనేది వేచి చూడాలి.