కృష్ణ మృతికి నివాళులర్పించిన నిర్మాత మండలి.. రేపు ఎల్లుండి సినిమా షూటింగులు బంద్!

సూపర్ స్టార్ కృష్ణ అనారోగ్య సమస్యలతో మరణించిన విషయం తెలిసిందే.సోమవారం తెల్లవారుజామున అనారోగ్య సమస్యలతో కాంటినెంటల్ ఆస్పత్రికి చేరిన కృష్ణనేడు తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఇక ఈయన మరణ వార్త తెలియగానే మహేష్ బాబు కుటుంబ సభ్యులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇక ఈయన మరణ వార్త తెలుసుకున్నటువంటి ఎంతోమంది సినీ రాజకీయ ప్రముఖులు కాంటినెంటల్ ఆస్పత్రికి చేరుకున్నారు.

ఇకపోతే కొంతసేపటి క్రితమే కృష్ణ గారి పార్థివ దేహాన్ని ఆయన కుటుంబ సభ్యులకు అప్పగించడంతో కృష్ణ గారి భౌతిక కాయాన్ని నానాగూడ్ లో ఉన్న కృష్ణ నివాసానికి తరలించారు. ఈ క్రమంలోనే కృష్ణ నివాసానికి ఎంతో మంది సినీ రాజకీయ ప్రముఖులు వచ్చి తనకు నివాళులు అర్పిస్తున్నారు. ఇక మరి కాసేపట్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం కృష్ణ ఇంటికి చేరుకోనున్నారు.

కృష్ణ మృతి పట్ల ఎంతో మంది నివాళులు అర్పించగా తెలుగు నిర్మాత మండల సైతం నివాళులు అర్పిస్తూ కృష్ణ మృతి కారణంగా రేపు ఎల్లుండి సినిమా షూటింగ్లకు విరామం ప్రకటిస్తూ ఆయన మరణానికి నివాళులు అర్పించారు.ఇక కృష్ణ గారి మృతదేహానికి తన ఇంట్లో చేయాల్సిన కార్యక్రమాలన్నింటిని పూర్తి చేసిన అనంతరం తన భౌతిక కాయాన్ని అభిమానుల సందర్శనార్థం గచ్చబౌలి స్టేడియానికి తరలించనున్నారు. ఇకపోతే ఈయన అంత్యక్రియలు రేపు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో అధికారక లాంచనాలతో జరగనున్నట్లు తెలుస్తోంది.