యాంకర్ రష్మీపై ఆ నిర్మాత షాకింగ్ కామెంట్స్.. కాల్ రికార్డు కూడా ఉందంటూ!

టాలీవుడ్ యాంకర్ రష్మీ గురించి అందరికీ పరిచయమే. ప్రస్తుతం బుల్లితెరపై ఈమె ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది. పైగా వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది. ఇదిలా ఉంటే తాజాగా ఆమెపై సీనియర్ నిర్మాత బాలాజీ నాగలింగం తాజాగా కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశాడు.

రాణి గారి బంగ్లా సినిమా సమయంలో ఒక పాట డబ్బింగ్ చేయనని.. హీరోని మార్చమని డిమాండ్ చేస్తూ చాలా దురుసుగా ప్రవర్తించిందని.. నాగబాబు, మల్లెమాల శ్యాంప్రసాద్ రెడ్డి తనకు తెలుసని బెదిరించిందని అన్నాడు. దాంతో తాను కూడా సినిమా విషయంలో న్యాయం కోసం తనను బెదిరించానని.. ఉద్దేశపూర్వకంగా మాత్రం అనలేదని.. దాంతో తాను సినిమా షూటింగ్ పూర్తి చేసిందని తెలిపాడు. పైగా తనతో ఆమె మాట్లాడిన కాల్ రికార్డింగ్ కూడా ఇప్పటికీ ఉందని అన్నాడు.