Balakrishna: ఆ మ్యూజిక్ డైరెక్టర్ వార్నింగ్ ఇచ్చిన బాలకృష్ణ… అసలేం జరిగిందంటే?

Balakrishna: నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బాలకృష్ణ ఒకవైపు వెండితెరపై అలాగే మరోవైపు వ్యాఖ్యాతగా కూడా అదరగొడుతున్నారు. ఇక బాలయ్య బాబు కోపం గురించి అందరికీ తెలిసిందే. ఈయనకు గనక కోపం వస్తే ఎదురుగా ఎవరున్నారో కూడా గుర్తించరు. ఇలా బాలకృష్ణ కోపంతో ఎంతో మందిని కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి.అయితే ఈ విధంగానే బాలకృష్ణ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ కి కూడా పైసా వసూల్ సినిమా సమయంలో బాగా వార్నింగ్ ఇచ్చారని తెలుస్తోంది.

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో అనూప్ రూబెన్స్ సంగీత దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన సినిమా పైసా వసూల్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రేక్షకులను సందడి చేయ లేకపోయినప్పటికీ ఈ సినిమా కోసం బాలకృష్ణ బాగా కష్ట పడినట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమా తరువాత పూరి జగన్నాథ్ బాలయ్య అభిమానిగా మారిపోయాడు. ఇక ఈ సినిమాలో కన్ను కన్ను కలిసాయి అనే పాట ఎంత హిట్టయ్యిందో అందరికీ తెలిసిందే.

ఈ క్రమంలోనే ఈ పాటను సరదాగా అనూప్ రూబెన్స్ పాడారు. ఈ పాటను రికార్డు చేసి బాలయ్య బాబుకు వినిపించారు. ఈ పాటను ఫిమేల్ వెర్షన్ లోకి మార్చాలని బాలకృష్ణ తో చెప్పడంతో ఒక్కసారిగా బాలకృష్ణ ఈ పాటను ఏమాత్రం కదిలించవద్దు. ఈ వాయిస్ కంటిన్యూ చేయాలని ఈ పాట మారిస్తే బాగుండదు అంటూ అనూప్ రూబెన్స్ కు స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక బాలకృష్ణ అంతలా చెప్పడంతో ఈ పాటను ఫిమేల్ వర్షన్ లో కాకుండా మేల్ వర్షన్ లోనే కొనసాగించారు.