సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో దర్శకనిర్మాతలకు ఒక సినిమా తెరకెక్కించాలి అంటే కత్తి మీద సాములా ఉంటుంది.సినిమా అనుకున్న బడ్జెట్ తో కాకుండా ఎక్కువ బడ్జెట్ ఖర్చు చేయడమే కాకుండా మధ్యలో చిత్రబృందం మధ్య మనస్పర్ధలు రావడం కొందరు సినిమా నుంచి తప్పుకోవడం, తిరిగి వారి స్థానంలో కొత్త వారిని తీసుకురావడానికి నిర్మాతలు ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు.ఇలా సినిమాల్లో ఇలాంటి కష్టాలను ఎదుర్కొని నష్టపోయిన దర్శకనిర్మాతలు కోకొల్లలుగా ఉన్నారు. అలాంటి వారిలో డైరెక్టర్ సాగర్ ఒకరు.
వివి వినాయక్,శీను వైట్ల వంటి ఎంతోమందికి దర్శకులకు గురువుగా ఉన్నటువంటి డైరెక్టర్ సాగర్ స్టువర్ట్పురం దొంగలు, పబ్లిక్ రౌడీ, నక్షత్ర పోరాటం, అమ్మదొంగా, యాక్షన్ నెం.1 వంటి సినిమాలకు దర్శకత్వం వహించి దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్నారు. ఇక సాగర్ దర్శకత్వంలో తెరకెక్కిన మూడవ సినిమా ఈయనకు ముప్పతిప్పలు పెట్టి ఎన్నో సమస్యలకు గురి చేసిందని చెప్పాలి. ఈయన దర్శకత్వంలో తెరకెక్కిన 3 వ చిత్రం మా వారి గోల.ఇక ఈ సినిమా దాదాపు 80 శాతం షూటింగ్ పూర్తి చేసిన తర్వాత నిర్మాత హిందీ సినిమా కోసం మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారు.ఇలా వదిలి వెళ్లడంతో సినిమా మధ్యలో ఆపేసిన డైరెక్టర్ అని పేరు వస్తుందని భావించి ఈయనే ఆ సినిమాని ఎలాగా పూర్తిచేసి విడుదల చేశారు.
అయితే ఈ సినిమా ఫ్లాప్ అవుతుందని ముందుగా ఊహించిన సాగర్ ఆయన అనుకున్న విధంగానే ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమా నిర్మించడం కోసం తరతరాలుగా ఆయన ఇంట్లో ఆస్తిగా ఉన్నటువంటి నగలను తాకట్టు పెట్టారు. ఇలాగే మరోసారి ఒక సాంగ్ రికార్డింగ్ కోసం ఈయన దగ్గర 25 వేల రూపాయలు లేకపోవడంతో యధావిధిగా తన ఇంట్లో ఉన్నటువంటి 15 కిలోల వెండి నగలను తీసుకువెళ్లి మార్వాడి దగ్గర పెట్టి ఆ సాంగ్ రికార్డింగ్ పూర్తి చేశారు. అయితే ఈయన మావారి గోల సినిమా ఫైనాన్షియల్ టెన్షన్ లో భాగంగా దర్శకత్వం పై దృష్టి పెట్టకపోవడంతో ఈసినిమా ఈయనకు బాక్సాఫీస్ వద్ద పెద్దగా కలెక్షన్లను రాబట్టలేకపోయిందని చెప్పాలి.
