బాత్ టబ్ లో ఫోటోషూట్ జరుపుకున్న నటి… ఈ వయసులో అతి అవసరమా అంటున్న నేటిజన్స్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటి సమీరా రెడ్డి చేసింది చాలా తక్కువ సినిమాలే ఆయనప్పటికీ ఈమె ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందారు.అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈమే నటించిన సినిమాలన్నీ కూడా డిజాస్టర్ గానే నిలిచాయి. కానీ ఎన్టీఆర్ తో ఈమెకు ఎఫైర్ ఉందంటూ వచ్చిన వార్తల కారణంగా ఈమె తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో పాపులర్ అయ్యారు. ఎన్టీఆర్ సరసన అశోక్ నరసింహుడు సినిమాలలో నటించిన సమీరా రెడ్డి వీరిద్దరి మధ్య ఏదో అఫైర్ ఉందంటూ అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

ఇలా ఈ వార్తల ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సమీరా రెడ్డి పూర్తిగా తెలుగు చిత్ర పరిశ్రమకు దూరమయ్యారు. ఈ విధంగా తెలుగు తెరకు దూరమైనప్పటికీ బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించినటువంటి ఈమె వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పారు. ఇక చాలా కాలం తర్వాత ఈమె తన బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ హాట్ టాపిక్ గా నిలిచారు. ఇలా ఈ ఫోటోలకు మంచి స్పందన రావడంతో ఈమె తరుచూ హాట్ ఫోటోలకు ఫోజులిస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.

ఈ క్రమంలోనే సమీరా రెడ్డి తాజాగా బాత్ టబ్ లో ఒంటి పై నూలు పోగు కూడా లేకుండా హాట్ ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ క్రమంలోనే ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈ ఫోటోలు చూసిన ఎంతో మంది నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు ఈ ఫోటోలపై స్పందిస్తూ ఈ వయసులో ఈ అతి అవసరమా.. అంటూ పెద్ద ఎత్తున నటి సమీరా రెడ్డి పై కామెంట్ లు చేస్తున్నారు.మొత్తానికి సమీరా రెడ్డి ఈ వయసులో కూడా గ్లామర్ డోస్ పెంచి మరి అభిమానులను సందడి చేస్తున్నారు.