“హరిహర వీరమల్లు”పై క్రేజీ న్యూస్ నిజమేనట..!

టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇపుడు పలు భారీ స్కేల్ సినిమాలు చేస్తూ తాను కూడా పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెట్టేందుకు సిద్ధం అయ్యాడు. కాగా రీసెంట్ గా వచ్చిన “ఓజి” సినిమా టీజర్ తో అయితే పాన్ ఇండియా మార్కెట్ పట్ల పవన్ ఫ్యాన్స్ కి కూడా కాస్త నమ్మకం వచ్చింది.

అయితే ఈ సినిమా కంటే ముందే పవన్ స్టార్ట్ చేసిన మొదటి భారీ పాన్ ఇండియా సినిమానే “హరిహర వీరమల్లు”. కాగా దీనిని దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తుండగా భారీ హిస్టారికల్ వండర్ గా అయితే ఈ సినిమా పవన్ కెరీర్ లో నెవర్ బిఫోర్ గా రాబోతుంది.

అయితే ఈ సినిమా పట్ల ఒకప్పుడు హైప్ ఇంకోలా ఉండేది కానీ ఇప్పుడు ఇది లేట్ అవుతూ వస్తుండడంతో పవన్ మరో చిత్రాలపైకి అందరి దృష్టి వెళుతుంది. కాగా ఇదిలా ఉండగా ఈ భారీ సినిమా పట్ల ఆ మధ్య ఎపుడో ఓ క్రేజీ వార్త బయటకి వచ్చింది. ఈ సినిమా కూడా పాన్ ఇండియా హిట్ సినిమాల సూత్రం సీక్వెల్ గానే ఉంటుంది అని వచ్చింది.

అంటే వీరమల్లు రెండు భాగాలు ఉంటాయని టాక్ వచ్చింది. అయితే ఇప్పుడు దీనిపై ఆల్ మోస్ట్ అఫీషియల్ క్లారిటీ అనుకునేలా పవన్ సన్నిహిత వర్గాలు వీరమల్లు రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్నారని ఇవాళ మళ్ళీ రివీల్ చేశారు. దీనితో ఈ భారీ చిత్రంపై అప్పుడు వచ్చిన వార్త నిజమే అని అనధికారికంగా కన్ఫర్మ్ అయ్యిపోయింది. ముందు మొదటి భాగం వస్తే నెక్స్ట్ దానికోసం ఆలోచించవచ్చని చాలా మంది అనుకుంటున్నారు. సో ముందు ఫస్ట్ పార్ట్ రిలీజ్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.