Prabhas: డార్లింగ్‌ ప్రభాస్‌కు సర్జరీ.. ? విశ్రాంతి తప్పదంటున్న డాక్టర్లు..!

Prabhas: సుమారు మూడేళ్ల తర్వాత యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ రాధేశ్యామ్‌ మూవీతో సిల్వర్‌స్క్రీన్‌పై కనిపించిన విషయం అందరికీ తెలిసిందే. కాగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీలో ప్రభాస్ జ్యోతిష్యుడి పాత్రలో నటించారు. పూజా హెగ్దే కథానాయికగా నటించగా, కృష్ణంరాజు నటించడం ఈ సినిమాకు మరో ఆకర్షణగా మారింది. కానీ ఊహించినంత రేంజ్‌లో ఈ సినిమా హిట్‌ను అందుకోలేదని పలు వర్గాల సమాచారం. అంతే స్థాయిలో నెగటివ్‌ రివ్యూలు వచ్చినా.. తెలుగులో మాత్రం భారీ కలెక్షన్లు సాధించినట్టు తెలుస్తోంది.

అయితే మొన్నటి వరకూ రాధేశ్యామ్‌ సినిమా ప్రమోషన్లలో బిజీగా గడిపిన ప్రభాస్, ప్రస్తుతం స్పెయిన్‌లో ఉన్నట్టు సమాచారం. అయితే అది కేవలం ఆయనకు అయిన గాయానికి చికిత్స కోసమేనని తెలుస్తోంది. ఇకపోతే ఇటీవలి కాలంలో సలార్‌ మూవీ షూటింగ్‌ సమయంలో ప్రభాస్‌ గాయపడిన విషయం అందరికీ తెలిసిందే. కాగా ఇప్పుడు గాయానికే ఇప్పుడు బార్సిలోనాలో సర్జరీ చేయించుకున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. దీంతో ప్రభాస్‌కు విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉందని డాక్టర్లు ఆయనకు సూచించినట్టు తెలుస్తోంది. దీంతో ఆయనకు త్వరగా కోలువాలని ప్రభాస్ అభిమానులు కోరుకుంటున్నారు.

ఇకపోతే కేజీఎఫ్‌ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ డైరెక్షన్‌లో సలార్‌ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇదే కాకుండా ఆదిపురుష్‌, నాగ్‌అశ్విన్‌ డైరెక్షన్‌లో ప్రాజెక్ట్‌ కే, స్పిరిట్, మారుతి డైరెక్షన్‌లో రాజా డీలక్స్‌లాంటి భారీ బడ్జెట్‌ మూవీస్‌ కూడా ప్రభాస్‌ చేతిలో ఉన్నాయి. బాహుబలి మూవీతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయిన ప్రభాస్‌.. సాహో మూవీతో తన రేంజ్‌ను మరింత పెంచుకొని తన హవాను కొనసాగిస్తున్నారు.