ఆ విషయంలో నరేష్ పై సీరియస్ అయిన కృష్ణ.. కుటుంబపరువు తీస్తున్నావు అంటూ..?

ప్రస్తుతం ఇండస్ట్రీలో నటుడు వీకే నరేష్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. కొంతకాలంగా కలిసి తిరుగుతున్న వీరు ఇటీవల వారిద్దరూ సహజీవనం చేస్తున్నట్లు అంగీకరించారు. అంతేకాకుండా తాజాగా మైసూర్ లోని ఒక హోటల్ గదిలో వీరిద్దరూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడటంతో నరేష్ మూడో భార్య రమ్య వీరి మీద చెప్పుతో దాడికి ప్రయత్నించింది. తనకి విడాకులు ఇవ్వకుండానే తన భర్త పవిత్రతో సహజీవనం చేస్తూ ఆమెని పెళ్లి చేసుకున్నాడు అంటూ నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి ఆరోపణలు చేసింది. చట్టబద్ధంగా నాకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తాను అంటూ రమ్య రఘుపతి చెప్పుకొచ్చింది.

అంతే కాకుండా విడాకుల కోసం నరేశ్ ఆమెని గన్నుతో బెదిరించాడని అరోపణలు చేసింది. అయితే నరేశ్ కూడా తన మూడో భార్య రమ్య కి డ్రైవర్ తో అక్రమ సంబంధం ఉంది .అందువల్లే నన్ను వదిలేసి వెళ్ళిపోయింది అంటూ ఆరోపించాడు. అయితే ఈ వివాదంపై ప్రముఖ నటుడు కృష్ణ గారు నరేష్ మీద సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో తన పేరుని వాడుకోవడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడని సమాచారం. గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పవిత్ర లోకేష్ తను నరేష్ తో సహజీవనం చేస్తున్న సంగతి కృష్ణ గారి ఆమోదంతోనే జరిగిందని తెలిపింది.నిజానికి సూపర్ స్టార్ కృష్ణ ఇలాంటి వివాదాలకు ఎప్పుడూ దూరంగానే ఉంటారు.

కానీ నరేష్ పవిత్ర లోకేష్ వ్యవహారం వల్ల ఇప్పుడు కృష్ణ గారి పేరు బయటికి వచ్చింది. ఇలా వీరిద్దరి వ్యవహారంతో తన పేరు బయటికి రావటంతో కృష్ణ గారు చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ విషయం పై నరేశ్ ని కృష్ణ మందలించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ఇలాంటీ చర్యల వల్ల నరేశ్ కుటుంబం పరువు తీసి, కుటుంబానికి చెడ్డ పేరు తెస్తున్నాడని కృష్ణ నరేశ్ ని మందలించినట్టు తెలుస్తోంది. మొత్తనికి నరేశ్, పవిత్రా లోకేశ్ వ్యవహారం వల్ల కృష్ణ గారి పరువుకి భంగం కలిగింది. అయితే నరేశ్ ని కృష్ణ గారూ మందలించినట్టు వస్తున్న వార్తలు పూర్తిగా నిజమో? కాదో? తెలియాల్సి ఉంది.