Sunrisers Hyderabad: మళ్లీ పంజా విసిరిన SRH.. ఆ ఒక్క ఛాన్స్ తో యూ టర్న్!

ఐపీఎల్ 2025లో వరుస ఓటములతో వెనకబడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకు తిరిగి ఫామ్‌లోకి వచ్చి అభిమానులకు ఊపిరి పీల్చుకునే అవకాశం ఇచ్చింది. శనివారం ఉప్పల్‌లో జరిగిన హై స్కోరింగ్ మ్యాచ్‌లో SRH, పంజాబ్ కింగ్స్‌ను 8 వికెట్ల తేడాతో దుమ్ముదులిపింది. 246 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం 18.3 ఓవర్లలో ఛేదించడమే ఈ విజయాన్ని ప్రత్యేకంగా నిలిపింది.

ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 245 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. శ్రేయస్ అయ్యర్ 39 బంతుల్లో 82 పరుగులు (7 ఫోర్లు, 5 సిక్సులు)తో దూకుడుగా ఆడగా, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ 42 (25 బంతుల్లో), ప్రియాన్ష్ ఆర్య 36 పరుగులు చేశారు. SRH బౌలింగ్‌లో హర్షల్ పటేల్ 4 ఓవర్లలో 42 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసి మెరిపించగా, ఇషాన్ మలింగా 2 వికెట్లు తీసి సహకరించాడు.

అనంతరం 246 లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన SRH కు శుభారంభం లభించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ 55 బంతుల్లోనే 141 పరుగులతో (14 ఫోర్లు, 10 సిక్సులు) విధ్వంసం సృష్టించాడు. 40 బంతుల్లో శతకం సాధించిన అతనికి, ఒక నోబాల్ రూపంలో వచ్చిన లైఫ్‌చాన్స్ కీలకమైంది. ట్రావిస్ హెడ్ 66 పరుగులు (32 బంతుల్లో) చేయగా, క్లాసెన్ 21 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. SRH 18.3 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 247 పరుగులు చేసి గెలుపొందింది.

ఈ విజయంలో 30 సిక్సులు, 44 బౌండరీలు నమోదవడం అభిమానులకు నాన్‌స్టాప్ ఎంటర్టైన్‌మెంట్‌ కలిగించింది. ఈ గెలుపుతో SRH పాయింట్ల పట్టికలో కీలకమైన పాయింట్లను సొంతం చేసుకుంది. ముఖ్యంగా అభిషేక్ శర్మ శతకం, హెడ్‌తో ఏర్పడిన భారీ భాగస్వామ్యం గెలుపుకు ప్రధానంగా నిలిచాయి. ఈ విజయంతో SRH మళ్లీ పోటీకి న్యాయమైన స్థాయిలో తిరిగొచ్చినట్లు స్పష్టం అయింది.

పాస్టర్ ప్రవీణ్ బాడీలో లిక్కర్|| Dasari Vignan EXPOSED Pastor Praveen Pagadala Case || Telugu Rajyam