Roja: రోజా పేరు వినగానే కన్నీళ్లు పెట్టుకున్న సుధీర్, శ్రీను… కారణం అదేనా?

Roja: రోజా పలు సినిమాలలో నటించి హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఈవిడ ఏపీ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఈ సందర్భంగా రోజా జబర్దస్త్ కామెడీ షో లో జడ్జ్ పదవికి స్వస్తి చెప్పింది.జబర్దస్త్ షో మొదలైన నాటి నుండి ఇప్పటివరకు రోజా ఆ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తోంది. ఈ కామెడీ షో ద్వారా ఎంతోమంది కమెడియన్లు గా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

ఈ జబర్దస్త్ షోలో పాటిస్పేట్ చేసే కమెడియన్ లతో రోజా గారికి మంచి అనుబంధం ఉంది.సాధారణంగా ఏదైనా వివాదం జరిగితే తప్ప ఏ కమెడియన్ కూడా జబర్దస్త్ షో ని వదిలి వెళ్ళటానికి ఇష్టపడరు. ప్రస్తుతం రోజా మంత్రి పదవి వచ్చిన కారణంగా జబర్దస్త్ షో ని విడిచి వెళ్లనుంది. ఈ సందర్భంగా రోజా గారికి కమెడియన్లు అందరూ కలిసి వీడ్కోలు పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి సంబంధించిన ఎపిసోడ్ ప్రోమో వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ ఈ వేదిక నుండి ఎమ్మెల్యేగా, మంత్రిగా పదవీ పొందాను అని ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది.

రోజా జబర్దస్త్ కి వీడ్కోలు పలుకుతుండటంతో అక్కడున్న వారందరూ బాధతో కన్నీళ్లు పెట్టుకున్నారు. రోజా గారితో వారందరికీ ఉన్న అనుబంధం అటువంటిది మరి. ఇక సుధీర్,శ్రీను విషయానికి వస్తె రోజా గారితో వారికున్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు . తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో గెటప్ శీను సుధీర్ రోజా గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. వీరిద్దరికీ రోజాతో ఎంతో మంచి అనుబంధం ఉండటం వల్ల ఆమె పేరు వినగానే ఒక్కసారిగా కంటతడి పెట్టుకున్నారు.