సోనూసూద్ క్రేజ్ ని వాడుకోబోతున్న స్టార్ హీరో ..డైరెక్టర్ ..?

సోనూసూద్ కి మామూలుగానే సౌత్ సినిమా ఇండస్ట్రీ తో పాటు బాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. సూపర్ సినిమాతో టాలీవుడ్ లో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన సోనూసూద్ ఆ సినిమాతో నాగార్జున తో సమానంగా నటించి దాదాపు హీరోకి వచ్చినంత క్రేజ్ ని తెచ్చుకున్నాడు. చెప్పాలంటే సూపర్ సినిమాలో సోనూసూద్ సెకండ్ హీరో అని చెపుకున్న వాళ్ళు లేకపోలేదు. ఇక అరుంధతి సినిమాతో తన లోని విలనిజాన్ని అద్భుతంగా చూపించాడు. అరుంధతి సినిమాలో జేజేమ్మ గా అనుష్క శెట్టికి ఎంత క్రేజ్ అండ్ పాపులారిటీ వచ్చిందో.. పశుపతి క్యారెక్టర్ చేసిన సోనూసూద్ కి అంతే క్రేజ్ వచ్చింది.

ఆ తర్వాత టాలీవుడ్ లో దాదాపు అందరి స్టార్ హీరోల సినిమాలలో విలన్ గా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించి మెప్పించాడు. అంతేకాదు బాలీవుడ్ సినిమాలలో కూడా నటించిన సోనూసూద్ అక్కడ కూడా మంచి పాపులారిటీ సాధించాడు. కాగా గత ఏడాది అంతా కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ తో కొన్ని వేలమంది ఎక్కడిక్కడ ఇరుక్కుపోయారు. సొంతూరు వెళ్ళే దారి లేక ఆకలితో అలమటించిపోయారు. అలాంటి వాళ్ళను ప్రత్యేక విమానాలలో .. రైళ్ళ లో .. బస్సులలో సొంతూరుకి చేర్చాడు. ఎవరు చేయని సహాయం సోనూసూద్ చేయడం గొప్పవిషయం. అంతేకాదు ఇదే కరోనా కారణంగా అంధకారంలోకి వెళ్ళిన కుటుంబాలను ఆదుకున్నాడు.

అనారోగ్యం తో బాధపడుతున్న వాళ్ళని ఆసుపత్రిలో చేర్పించి తగు సేవలు అందించాడు. ఎంతోమందికి ఆర్థికంగా ..ఆరోగ్య పరంగా.. జీవనోపాది కల్పించి నిజ జీవితంలో హీరో అనిపించుకున్నాడు. ఈ హీరోని ఇప్పుడు బాలయ్య – బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా బిబి 3 లో మేయిన్ విలన్ పాత్రకి ఎంపిక చేసుకోనున్నట్టు తాజా సమాచారం. ఒకరకంగా సోనూసూద్ క్రేజ్ సినిమాకి బాగా ఉపయోగించుకోవాలని మేకర్స్ అనుకుంటున్నారట. అటు నటుడిగా ఇటు సామాజిక సేవలో ఇపుడు సోనూసూద్ కి ఉన్న క్రేజ్ మరెవరీకీ లేదని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అదే బిబి 3 కి ప్లస్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారని సమాచారం. మరి నిజంగా బిబి 3 లో సోనూసూద్ నటిస్తున్నాడా లేదా చూడాలి.