ఎవరైనా ఆ పని చేస్తే చెడ్డ కోపం వస్తుంది: సాయి పల్లవి

నేచురల్ బ్యూటీ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం తెలుగు తమిళ సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న సాయి పల్లవి గార్గి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ సినిమాను తన ఖాతలో వేసుకున్నారు. ఇకపోతే ఈ సినిమా మంచి రెస్పాన్స్ అందుకోవడంతో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవి తన గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపారు. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ సాధారణంగా తనకు కోపం రాదని తెలిపారు.

తాను ఎప్పుడూ కూడా తొందరగా ఒకరిపై కోపం తెచ్చుకోనని, వీలైనంత వరకు ప్రశాంతంగానే మాట్లాడతానని తెలిపారు.ఈ విషయం పై సాయి పల్లవి చెప్పిన మాటలు పూర్తిగా వాస్తవమే ఆమె ఎప్పుడు చూసినా చిరునవ్వులు చిందిస్తూ అందరితో మాట్లాడుతూ ఉంటారు. అయితే తనకు ఒక పని చేసినప్పుడు మాత్రమే చాలా కోపం వస్తుందని తన కోపం గురించి వెల్లడించారు. మరి ఈ కూల్ బ్యూటీకి కోపం తెప్పించే ఆ పని ఏమిటి అనే విషయానికి వస్తే…

సాయి పల్లవి నిద్రపోతున్న సమయంలో తనని ఎవరైనా నిద్ర లేపుతూ డిస్టర్బ్ చేస్తే కనుక తనకు చాలా కోపం వస్తుందని, ఆ సమయంలో అవతల ఎవరున్నా తను కోపం తెచ్చుకుంటానని ఈ సందర్భంగా సాయి పల్లవి తెలియజేశారు. అయితే ప్రస్తుతం ఈమె చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే తెలుగులో ఈమె నటించిన విరాటపర్వం సినిమా కమర్షియల్ గా విజయం సాధించలేకపోయిన ఈమె నటించిన వెన్నెల పాత్రకు మాత్రం మంచి గుర్తింపు వచ్చిందని చెప్పాలి.