విజయ సేతుపతి సినిమా షూటింగ్ మధ్య నుండి వెళ్ళిపోయిన శ్రుతిహాసన్

కరోనా వల్ల చిత్ర పరిశ్రమ దారుణంగా దెబ్బతినింది, పరిశ్రమని నమ్ముకుని ఉన్న చిన్న మధ్య నటీనటులు మరియు శ్రామికులు చాలా ఇబ్బందులకు గురి అయ్యారు. దాదాపు అయిదు ఆరు నెలలు షూటింగ్ లు జరగలేదు. ఎట్టకేలకు మళ్లీ షూటింగ్ ల సందడి కొనసాగుతుంది. కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ లు జరుపుకుంటున్నారు. ఔట్ డోర్ షూటింగ్ అంటే ఖచ్చితంగా జనాలు వందల సంఖ్యలో వస్తారు. కాని ఈ సమయంలో అంత మంది జనాలు వస్తే చాలా ప్రమాదం. ఆ విషయం ప్రతి ఒక్కరు గుర్తించాలి. జనాలు రాని చోట షూటింగ్ చేసుకోవాలి. లేదంటే జనాలు రాకుండా అయినా జాగ్రత్తలు తీసుకోవాలి. కాని శృతి హాసన్.. విజయ్ సేతుపతి జంటగా తెరకెక్కుతున్న తమిళ సినిమా షూటింగ్ స్పాట్ కు వందల మంది జనాలు ఒక్క సారే రావడంతో గందరగోళం ఏర్పడిందట.

sruthihasan went out from the middle of new movie shooting
Shruthi hasan

అంత మంది ఒక్కసారే చూసేందుకు ఎగబడి రావడంతో శృతి హాసన్ చిత్ర యూనిట్ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేసి కనీస జాగ్రత్తలు తీసుకోకుండా ఎలా అంటూ అసహనంగా అక్కడ నుండి వెళ్లి పోయింది. షూటింగ్ మద్యలో శృతి హాసన్ వెళ్లి పోవడంతో ఒకటి రెండు షాట్ లు ఆమె లేకుండా చిత్రీకరించి పేకప్ చెప్పేశారట.షూటింగ్ నుండి అర్థాంతరంగా వెళ్లి పోవడంపై శృతి స్పందిస్తూ.. ఈ సమయంలో ప్రతి ఒక్కరి ఆరోగ్యం చాలా కీలకం. కరోనా ఇంకా పోలేదు… ప్రతి ఒక్కరు కూడా ప్రొటోకాల్ పాటించాల్సిందే. అలా చేయకుంటే మహిళగా నా జాగ్రత్త నేను తీసుకుంటా అందుకే షూటింగ్ మద్యలో నుండి వచ్చానంటూ తన ప్రవర్తను సమర్థించుకుంది. యూనిట్ సభ్యులు ఆమె తీరును ఇప్పటి వరకు తప్పుపట్టలేదు. తమిళ మీడియాలో ఈ విషయంపై రకరకాలుగా కధనాలు ప్రముఖంగా ప్రచురితమవుతున్నాయి.