31న విడుదలవుతున్న షారుఖ్‌ ‘జవాన్‌’ ట్రైలర్‌

షారుఖ్‌ జవాన్‌పై రోజురోజుకు అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. సరిగ్గా తొమ్మిది రోజుల్లో ఈ పాటికి థియేటర్‌లు దద్దరిల్లుతుంటాయి. పైగా తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమున్న అట్లీ ఈ సినిమా తెరకెక్కించడంతో ఓ రేంజ్‌లో అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రమోషన్ల పనిలో పడిపోయింది. హిందీ సహా తమిళ, తెలుగు భాషల్లో పెద్ద ఎత్తున రిలీజ్‌ కాబోతున్న ఈ సినిమాకు అట్లీ దర్శకత్వం వహించాడు.

అప్పుడెప్పుడో రిలీజైన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ నుంచి రీసెంట్‌గా రిలీజైన సెకండ్‌ సింగిల్‌ వరకు ప్రతీది సినిమాపై అంతకంతకూ అంచనాలు పెంచుతూ వస్తున్నాయి. ఇక త్వరలోనే చెన్నైలో ప్రీ రిలీజ్‌ వేడుకను గ్రాండ్‌ లెవల్లో ఎª`లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఆ తర్వాత తెలుగు, హిందీలో ప్రెస్‌ విూట్‌లు నిర్వహించేలా ఎª`లాన్‌ చేసుకుంటుంది.

ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ అప్‌డేట్‌ వచ్చేసింది. ఈ సినిమా ట్రైలర్‌ను ఆగస్టు 31న రిలీజ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే అదే రోజున చెన్నైలో ఓ గ్రాండ్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించి అక్కడే ట్రైలర్‌ రిలీజ్‌ను ఎª`లాన్‌ చేసినట్లు తెలుస్తుంది. యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్‌ సేతుపతి ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. షారుఖ్‌కు జోడీగా నయనతార నటించింది.

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొనే గెస్ట్‌ అప్పియరెన్స్‌ ఇవ్వనుంది. రెడ్‌ చిల్లీస్‌ బ్యానర్‌పై గౌరీఖాన్‌ ఈ సినిమాను నిర్మించింది. ఇక ఇప్పటికే ఈ సినిమా థియేట్రికల్‌, నాన్‌ థియేట్రికల్‌ హక్కులన్ని కలుపుకుని భారీ స్థాయిలో బిజినెస్‌ జరిగిందని, విడుదలకు ముందే సినిమాకు మూడొందల కోట్లు లాభాలు వచ్చాయని బాలీవుడ్‌ విూడియా టాక్‌.