థూ టాలీవుడ్.. ఒక్క నా కొడుకు రాలేదు.. సినీ పెద్దలను ఏకిపారేసిన శ్రీ రెడ్డి

Sri Reddy Fires On Tollywood Not Attending SP BalasubrahManyam Final Rituals

ఎస్పీబీ అంత్య క్రియలకు టాలీవుడ్ నుంచి ఒక్కరు కూడా వెళ్లకపోవడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. కోలీవుడ్‌లో సెలెబ్రిటీలందరూ బాలు చిత్రపటాలకు పూల మాలలు వేసి దేవుడిలా కొలుస్తున్నారు. ఇళయారాజా ఏకంగా దీపాన్ని పెట్టి ఆరాధించాడు. అయితే టాలీవుడ్ మాత్రం ట్వీట్లు వేసి చేతులు దులుపుకుంది. ఈ విషయంలో అందరూ టాలీవుడ్ పెద్దలను వేలెత్తి చూపిస్తున్నారు.

కడసారిగా ఎస్పీబాలు భౌతిక కాయాన్ని చూసేందుకు ఒకే ఒక్కడు వెళ్లాడు. దళపతి విజయ్ మాత్రమే ఎస్పీబీని చివరి సారిగా సందర్శించుకున్నాడు. చరణ్‌ను ఓదార్చాడు. ఇక విజయ్ చేసిన ఈ మంచి పనికి మరోసారి రియల్ హీరో అనిపించుకున్నాడు. అయితే టాలీవుడ్ నుంచి కనీసం ఒక్కరు కూడా వెళ్లకపోవడంతో అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంపై సంచలన తార శ్రీ రెడ్డి రెచ్చిపోయింది.

Sri Reddy Fires On Tollywood Not Attending SP BalasubrahManyam Final Rituals
Sri Reddy Fires On Tollywood Not Attending SP BalasubrahManyam Final Rituals

థూ టాలీవుడ్ అంటూ రెచ్చిపోయాడు. ఒక్క నా కొడుకు.. ఒక్క హీరో కూడా రాలేదు.. ఎస్పీబీ గారిని చూసేందుకు ఒక్కడంటే ఒక్కడు రాలేదు.. మీ గొప్పలు మీరు చెప్పుకోవడానిమా మా అసోసియేషన్ స్టేజ్ మీద శాలువాలు కప్పుకోవడానికి గొడవలు పెట్టుకోవడానికి సమయం ఉంటుంది కానీ ఎస్పీబీ లాంటి వారు చనిపోతే చూసేందుకు రావడానికి సమయం ఉండదు.. మీలాంటి వాళ్లకు ఇళ్లు దాటితే కరోనా వస్తుంది.. ఇక్కడి వస్తే కరోనా ఏం రాదు.. తెలుగు నటిని అని చెప్పుకోవడానికి సిగ్గేస్తోంది. నేను కూడా ఎస్పీబీ గారిని చివరి సారి చూసేందుకు వెళ్లాను కానీ టాలీవుడ్ తరుపున కాదు.. కోలీవుడ్ తరుపున అంటూ అందర్నీ ఓ రౌండ్ వేసుకుంది. ప్రస్తుతం శ్రీ రెడ్డి వీడియో వైరల్ అవుతోంది.