Sree Reddy: నాగబాబూ…. ఇప్పటికైనా ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడు…లైవ్‌లోనే రెచ్చిపోయిన శ్రీ రెడ్డి

Sree Reddy: క్యాస్టింగ్ కౌచ్‌తో టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన శ్రీరెడ్డి, అప్పట్లో ఎంత రచ్చ చేసిందో అందరికీ తెలిసిందే. పలువురు సినీ సెలబ్రెటీలను విమర్శిస్తూ పలు కాంట్రవర్సీయల్ కామెంట్స్ కూడా చేసింది. అందులో ముఖ్యంగా మెగా ఫ్యామిలీని తన నోటికొచ్చి నట్టూ తిడుతూ ఎన్నో సార్లు వైరల్‌గా కూడా మారింది. కానీ ఆ తర్వాత శ్రీరెడ్డి ఎంత అరిచినా ఏం చేసినా అందరూ చూసీ, చూడనట్టు వదిలేశారు. దాంతో ఆమె ఆ వివాదాలకు దూరంగా కొంతకాలం వార్తల్లో కనిపించకుండా పోయింది.

ఇక మళ్లీ తాను మారిపోయానంటూ ఇటీవలి కాలంలో అందరి ముందుకూ వచ్చి ఆశ్చర్య పరిచింది. యూట్యూబ్ ఛానెల్‌ను కూడా స్టార్ట్ చేసి, భిన్న వీడియోలు చేస్తూ, కొంత వరకు నిజంగానే మారిపోయిందా అనిపించేలా తన వెరైటీ కంటెంట్‌తో అలరిస్తోంది. దీంతో ఆమెకు మళ్లీ పాపులారిటీతో పాటు, ఆదాయం కూడా భారీ స్థాయిలోనే వస్తున్నట్టు సమాచారం.

ఇదిలా ఉండగా ఇటీవల మెగా ఫ్యామిలీకి చెందిన నాగబాబు కూతురు నిహారిక ఓ పబ్ రైడ్‌లో పట్టుబడ్డ విషయం తెలిసిందే. అయితే తాజాగా శ్రీరెడ్డి ఈ విషయంపై తీవ్రస్థాయిలో స్పందించింది. ఒకప్పుడు నాగబాబు తనను ఎంతో టార్గెట్ చేశాడని, మీటింగ్‌ల మీద మీటింగ్‌లు పెట్టి తన గురించి పిచ్చిపిచ్చిగా వాగాడని ఆమె పేర్కొంది. అంతే కాకుండా నాగబాబును స్నేక్ బాబు అని సంబోధిస్తూ నేను శక్తిని కాకపోవచ్చు కానీ, నేను పూజించేది శక్తినే అంటూ విరుచుకుపడింది. మా వైసీపీ వాళ్లని కించపరుస్తూ మాట్లాడావ్ కదా, ఇప్పుడేమంటావ్ మరి? మీ వీర మహిళ సంగతి ఏంటీ ? అని శ్రీరెడ్డి కోపోద్రోక్తోరాలైంది. ఇక మా ఇంటి ఆడపిల్లలు అలా కాదు, ఇలా కాదు అన్నావ్ కదా, ఇప్పుడేమంటావ్ అంటూ పవన్ కల్యాణ్‌పై వ్యాఖ్యలు చేసింది. మీ అన్నయ్య బిగ్ బాస్ స్టేజ్ మీద ఓ ట్రాన్స్ జెండర్‌తో ఎలా తిట్టించాడో చూశాం. అసలు మీ పెంపకాలు ఏంట్రా ? అయినా ఆ పిల్లది తప్పు కాదు, పెంపకానిది అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. మా పెంపకాలు గొప్పవని మేమేం చెప్పడం లేదన్న శ్రీరెడ్డి, అందుకే మా బతుకు ఇలా ఉందని ఆవేదన చెందింది. నువ్వు నీతులు చెప్తావ్ కదా, నీ కూతుర్ని ఏంటీ ఇలా పెంచావు, మా గురించి కామెంట్లు చేస్తావ్ కదా, ఈ రోజు నీ పరిస్థితి ఏంటి అంటూ ప్రశ్నలవర్షం కురిపించింది శ్రీరెడ్డి.

ఇంట్లో అమ్మాయిలకు ప్రాబ్లమ్ వస్తే ఎలా ఉంటుందో, వాళ్ల పేరెంట్స్ ఎంత బాధపడతారో ఇప్పటికైనా తెలిసిందా అంటూ శ్రీరెడ్డి ఆవేశంతో ఊగిపోయింది. ఇది శాంపిల్ మాత్రమే నాగబాబూ.. ఇంకా ఇంకూ అనుభవిస్తావు. నన్ను ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా గడిపేలా చేశావు, చివరికి దేవుడి కోర్టులో ఎవరూ తప్పించుకోలేరు. కర్మ అనేది దూల తీర్చేస్తుంది అంటూ శ్రీరె‌డ్డి హెచ్చరించింది. ఇప్పటికైనా మంచి, చెడులు ఆలోచించి , ఏ అమ్మాయినైనా తిట్టేటపుడు ఒళ్లు దగ్గర పెట్టుకోండి అంటూ శ్రీరెడ్డి తన స్టైల్లో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.