బలవంతపు బంధాల కన్నా ఒంటరి జీవితమే మంచిది.. సదా పోస్ట్ వైరల్?

బ్లాక్ బస్టర్ మూవీ జయం సినిమాతో తెలుగు తెరపై కనిపించిన హీరోయిన్ సదా మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసును కొల్లగొట్టిందనే చెప్పాలి.
తర్వాత స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన అపరిచితుడు మూవీతో తమిళ్ తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. తర్వాత అడపా దడపా సినిమాల్లో కనిపిస్తూ అనూహ్యంగా సినిమాలకు దూరం కావడంతో తన అభిమానులను నిరుత్సాహ పరిచింది. తర్వాత బుల్లితెరపై పలు షోలల్లో జడ్జిగా వ్యవహరిస్తూనే సోషల్ మీడియాలో తనకు సంబంధించిన విషయాలను తన అభిమానులతో ఎంతో ఆసక్తికరంగా పంచుకుంటుంది.

తాజాగా బ్యూటీ హీరోయిన్ సదా ఒంటరితనం, బంధాలు అనుబంధాలు అంటూ పలు ఆసక్తికర విషయాలను సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకుంది. మన ఇంట్లో పనికిరాని వస్తువులను ఎలాగైతే విసిరి మూలన పడేస్తాము అలాగే మన గమ్యానికి ఎదురు వచ్చే బంధాలను వ్యక్తులను పక్కన పెట్టేయాలని,మన ఎదుగుదల కోరుకొని బంధాల్లో బలవంతంగా ఇరుక్కొని బాధపడే దానికంటే ఎదిరించి ఒంటరిగా ఉండడమే మంచిది జీవితం చాలా చిన్నది. నీకు ఇష్టమైన జీవితాన్ని గడపడానికి అధిక ప్రాముఖ్యత ఇవ్వాలని తన మనసులోని మాటలను చెప్పుకొచ్చింది.

అలాగే మన మనసుకు నచ్చిన వారిని కోల్పోతామేమోనని చాలామంది భయపడుతుంటారు
కొన్నిసార్లు మనం నమ్మిన మన బంధువులు మిత్రులే మనల్ని మోసం చేస్తు అవసరమైన సందర్భాల్లో మనకు సహకరించరు. అలాంటి వారితో జీవితం కొనసాగించడానికి మనము నమ్ముకున్న జీవితాన్ని గడపడమే మంచిది. అలాంటి వారితో కలిసి ఉంటే మనల్ని మనం మోసం చేసుకున్నట్లే అందుకే అలాంటి వారిని దూరం పెట్టి జీవిత గమ్యాన్ని ప్రారంభించాలని కడవరకు ఎందరో వ్యక్తులు వస్తుంటారు పోతుంటారు నీకు నువ్వే తోడుంటావు అంటూ హీరోయిన్ సదా ఎంతో ఎమోషనల్ సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేయడంతో ప్రస్తుతం వైరల్ గా మారింది.