గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్కు ఇప్పుడు క్రికెట్ మైదానంలో ఆటే కాదు, అతని ప్రవర్తన కూడా సమస్యగా మారింది. ఇటీవల సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో గిల్ రెండు సందర్భాల్లో ఫీల్డ్ అంపైర్లతో తీవ్రంగా వాగ్వాదానికి దిగాడు. మొదటగా తాను ఔట్ అయినప్పుడూ, తరువాత అభిషేక్ శర్మకు ఎల్బీడబ్ల్యూ నాటౌట్ ఇచ్చినప్పుడు గిల్ ఒప్పుకోకపోవడంతో వ్యవహారం వేడెక్కింది.
ఈ ప్రవర్తనపై ఐపీఎల్ కమిటీ ఫోకస్ చేసే అవకాశం ఉంది. ఐసీసీ ప్రవర్తనా నియమావళి ప్రకారం, ఆటగాడు అంపైర్ తీసుకున్న నిర్ణయంపై బహిరంగంగా నిరసన తెలిపితే, లేదా మ్యాచ్ను ఆటంకపరిచేలా ప్రవర్తిస్తే, అది కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘనగానే పరిగణించబడుతుంది. గిల్ నిరసన వ్యక్తీకరణలో చూపించిన హెచ్చుతగ్గులు కోడ్ 2.8లో పేర్కొన్న పాయింట్లతో సరిపోలుతుండడంతో ఆయనపై చర్యలు తధ్యం కావొచ్చని విశ్లేషకుల అభిప్రాయం.
గిల్కు మొదటి తప్పిదానికి హెచ్చరికతో గట్టిపెట్టే అవకాశం ఉన్నా, రెండో తప్పు విషయంలో మాత్రం పరిస్థితి చిక్కుల్లోకి నడిపేలా ఉంది. మ్యాచ్ ఫీజులో 50 శాతం వరకు జరిమానా, డీమెరిట్ పాయింట్లు విధించబడే అవకాశం ఉంది. అదే తీవ్రత ఎక్కువగా గుర్తించబడితే, ఒక మ్యాచ్ సస్పెన్షన్ కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇప్పటికే ఆటగాళ్ల ప్రవర్తనపై ఐపీఎల్ నిర్లక్ష్యం చూపదనే విషయం తెలిసిందే.
ప్రస్తుతం గిల్ అద్భుత ఫామ్లో ఉన్నాడు. తన జట్టుకు నాయకత్వం వహిస్తూ వరుస విజయాలతో జట్టును ప్లే ఆఫ్స్ దిశగా నడిపిస్తున్నాడు. ఇలాంటి సమయంలో వాగ్వాదాల వల్ల వేటు పడితే గుజరాత్ టైటాన్స్ వ్యూహాలపై ప్రభావం పడే అవకాశముంది.