షాకింగ్ : రాజమౌళి, మహేష్ సినిమాపై ఇంకా క్లారిటీ రాలేదట.!

ఇప్పుడు పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ స్థాయిలో కూడా భారీ స్థాయి అంచనాలు నెలకొల్పుకున్న లేటెస్ట్ చిత్రాలు కొన్ని రావడానికి సిద్ధంగా ఉన్నాయి అలాగే ఇంకా తెరకెక్కాల్సి ఉన్నాయి. మరి ఈ అన్ని సినిమాల్లో భారీ స్థాయి సినిమా అని డెఫినెట్ గా దర్శకుడు రాజమౌళి మరియు సూపర్ స్టార్ మహేష్ బాబుల కాంబో సెట్ చేసిన సినిమా కోసం చెప్పుకొని తీరాలి.

అధికారికంగా అనౌన్స్ చేసిన ఈ సినిమా ఇంకా పట్టాలెక్కేందుకు సమయం ఉంది కానీ దానికి ఉన్న ఈ గ్యాప్ మాత్రం సరైన క్లారిటీతో ఫిల్ అవ్వలేదని చెప్పాలి. ఎందుకంటే రాజమౌళి ప్రతి సినిమాకి కూడా తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథను అందిస్తారని తెలిసిందే. అలాంటిది విజయేంద్ర ప్రసాద్ ప్రస్తుతం ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ పై షాకింగ్ న్యూస్ ని రివీల్ చేశారు.

రాజమౌళి మహేష్ సినిమాపై ఇంకా తాము ఎలాంటి స్టోరీ కూడా డిసైడ్ అవ్వలేదని ఇంకా కాన్సెప్ట్ సెట్ చేసే పనిలోనే ఉన్నామని ఇద్దరికీ కూడా ఆ కథని సెట్ చెయ్యడానికే మైండ్ అంతా ఎక్కువ కష్టపెట్టాల్సి వస్తుంది అని రీసెంట్ గా ఓ ఫంక్షన్ లో మాట్లాడినట్టు తెలుస్తుంది. దీనితో ఈ చిత్రం కోసం అయితే ఈ షాకింగ్ న్యూస్ బయటకి వచ్చి సినీ వర్గాల్లో వైరల్ గా మారింది.