షాకింగ్ : “బ్రో” పై కేసు..ఢిల్లీకి అంబటి.!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గత మూడు చిత్రాలు కూడా రీమేక్ సినిమాలే కాగా ఈ చిత్రాలు మూడూ కూడా ఏపీలో ఏదొక రకంగా కాంట్రవర్సీలో హాట్ టాపిక్ గా మారాయి. అయితే పవన్ నటించిన రీసెంట్ చిత్రం అది కూడా హీరోగా కూడా కాని చిత్రంపై ఏపీలో సరికొత్త రచ్చ షురూ అయ్యింది.

ఈ చిత్రం విషయంలో పొలిటికల్ కోణాలు వెలువడుతుండగా చిత్ర నిర్మాతలకి ఏపీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు బ్లాక్ మనీ ఇచ్చి పవన్ కి రెమ్యునరేషన్ గా మార్చారు అంటూ ఏదేదో వార్తలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. అయితే సినిమాకి సంబంధించిన అకౌంట్ వివరాలు అన్నీ మాకు మాకు మధ్యలో ఉంటాయి అని.

మధ్యలో ఎవరో అడిగితె ఎలా చెప్తాం ని నిర్మాతలు తేల్చేసారు. ఇక మరో పక్క తన పాత్రని అవమానించారు అని ఏపీ నీటి పారుదల శాఖా మంత్రి ప్రెస్ మీట్ కూడా పెట్టడం వైరల్ గా మారింది. ఇక ఇదిలా ఉండగా లేటెస్ట్ గా అంబటి రాంబాబు షాకింగ్ గా ఈ సినిమా విషయంలో ఈడీ కి కంప్లైంట్ చేసేందుకు వెళ్తున్న వార్తలు ఆశ్చర్యకరంగా మారాయి.

అసలు ఇంత సీరియస్ ఎందుకు తీసుకుంటున్నారు అని పైగా అంబటి తన శాఖకి సంబంధించి ఢిల్లీ వెళ్లి ఏమన్నా పనులు చేయించుకున్నారా? ఎప్పుడు లేనిది ఈ సినిమా విషయంలో ఇంత శ్రద్ధ ఏమిటో అని సినీ వర్గాలు అంటున్నాయి. అసలు సినీ పాలిటిక్స్ లో ఏం జరుగుతుందో ఏంటో ఎవరికీ అర్ధం కావట్లేదు.