Sharwanand: శర్వానంద్‌కు కరోనా.. ప్రమోషన్స్‌కి అందుకే దూరంగా ఉన్నాడా..!

Sharwanand: టాలీవుడ్ స్టార్ హీరోలతో పాటు తనక్కూడా ఓ ప్రత్యేకమైన మార్కెట్‌ను సంపాదించుకున్న నటుడు శర్వానంద్. శతమానం భవతి సినిమాతో మంచి హిట్ అందుకున్న శర్వా.. మళ్ళీ ఇప్పటి వరకు ఆ రేంజ్‌లో హిట్ దక్కించుకోవడానికి తన వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఓ వైపు కమర్షియల్ సినిమాలు చేసైనా సక్సెస్ తెచ్చుకోవాలనుకున్న తన హోప్స్‌ కూడా ఆయన్ని చాలా గట్టిగానే దెబ్బకొట్టాయి. ఆ తర్వాత చాలా సినిమాలు చేసినా అవన్నీ కూడా వరుసల ఫ్లాపులు అయినా కూడా తదుపరి సినిమాలపైనే దృష్టి పెట్టారు శర్వానంద్.

కాగా ఇటీవల శర్వానంద్ హీరోగా, రష్మిక హీరోయిన్‌గా తెరకెక్కిన చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు. తాజాగా విడుదలైన ఈ సినిమాకు ప్రస్తుతం మంచి టాకే వినిపిస్తోంది. ఈ సినిమాలోని పాటలు, ట్రైలర్‌ ఆసక్తిని పెంచడంతో ప్రేక్షకుల్లో ముందు నుంచే పాజిటివిటీ మొదలైందని చెప్పవచ్చు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిర్మించిన ఈ సినిమాపై చిత్ర బృందం కూడా భారీ స్థాయిలో పెట్టుకున్న అంచనాలు నిజమవుతాయనే అనిపిస్తోంది. అంతే కాకుండా ఈ మూవీ ధికా శరత్‌కుమార్, ఖుష్బు, ఊర్వశి వంటి సీనియర్‌ హీరోయిన్‌లు కూడా నటించడంతో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రమోషన్స్ ప్రారంభించిన చిత్ర యూనిట్.. అందులో హీరో శర్వానంద్ మాత్రం కనిపించకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఏం జరిగిందని ఆరా తీయగా అతనికి క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ కావ‌డంతోనే ప్రమోషన్స్‌కి దూరంగా ఉన్నారని సమాచారం. ఈ విషయం తెలిసిన ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అంతే కాకుండా ఈ సినిమా ఆయనకు మంచి హిట్ తెచ్చిపెట్టాలని వారు ఆకాంక్షిస్తున్నారు.