షారుఖ్‌.. రాణీ ముఖర్జీ కొంగు పట్టుకొని థియేటర్‌లోకి ఎంట్రీ!

కరణ్‌ జోహార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్‌ డ్రామా చిత్రం ‘కుచ్‌ కుచ్‌ హోతా హై’. బాలీవుడ్‌ బాద్‌ షా షారుఖ్‌ ఖాన్‌, కాజోల్‌, రాణీ ముఖర్జీ తదితరులు ఈ చిత్రంలో నటించారు. 1998 అక్టోబర్‌ 16న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి హిట్‌ సొంతం చేసుకుంది.

ఈ చిత్రం విడుదలై నేటికి 25 ఏళ్లు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని గత రాత్రి అభిమానుల కోసం ముంబైలో కేవలం రూ.25కే మూడు ప్రత్యేక ప్రదర్శనలను నిర్వహించారు. ఈ స్పెషల్‌ స్క్రీనింగ్‌కు కరణ్‌ జోహార్‌తోపాటు బాలీవుడ్‌ బాద్‌ షా షారుఖ్‌ ఖాన్‌, రాణీ ముఖర్జీ సహా ఇతర చిత్ర బృందం హాజరైంది.

ఈ సందర్భంగా షారుఖ్‌.. రాణీ ముఖర్జీ కొంగు పట్టుకొని థియేటర్‌లోకి ఎంట్రీ ఇచ్చి అభిమానుల్ని ఆశ్చర్యానికి గురి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్‌ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు షారుఖ్‌ను ‘జెంటిల్‌మెన్‌’ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.