సెన్సేషనల్ : ఆస్కార్ కి “బలగం”.!

ఈ ఏడాది టాలీవుడ్ సినిమా దగ్గర వచ్చి అద్భుతమైన ఆదరణతో రాణిస్తున్న చిత్రం ఏదన్నా ఉంది అంటే అది ఖచ్చితంగా “బలగం” సినిమానే అని చెప్పాలి. ఓ బ్యూటిఫుల్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా తెలుగు సినిమా గర్వపడే చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

అయితే ఓటిటి లో వచ్చినప్పటికీ కూడా థియేటర్స్ లో ఈ సినిమా సత్తా చాటుతూ ఉండడం అలాగే సినిమా చూసి ఎంతమంది గొడవలు మరిచి ఒకటయ్యేలా చేసింది ఈ సినిమా. దీనితో ఓ రేంజ్ లో మారుమోగిపోతున్న ఈ సినిమా పేరు ఖచ్చితంగా ఆస్కార్ అవార్డ్స్ లో ఉండొచ్చు అని చెప్పడంలో సందేహం లేదు.

ఈ తరహా కంటెంట్ ఉన్న సినిమాలను మన దేశం నుంచి ఇది వరకే ఎన్నో పంపారు. మరి ఈ సినిమా విషయంలో కూడా తప్పకుండ ఆస్కార్ కి ఈ సినిమాని పంపుతామని నిర్మాత దిల్ రాజు లేటెస్ట్ గా ప్రకటించడం వైరల్ గా మారింది. ఖచ్చితంగా బలగం సినిమా ఆస్కార్ కి అర్హత కలిగినదే అని దిల్ రాజు మంచి డెసిషన్ తీసుకున్నారని అయితే ఇప్పుడు ప్రశంసలు అందుతున్నాయి.

కాగా దీనికి అయితే ఇంకా సమయం ఉండగా దిల్ రాజు ఇచ్చిన మాట ఇపుడు సెన్సేషనల్ స్టేట్మెంట్ గా నిలిచింది. మరి ఈ కోణంలో సినిమాని ఎలా తీసుకెళ్లారో చూడాలి. ఒక ఈ సినిమాకి వేణు ఎల్దండి దర్శకత్వం వహించగా ప్రియ దర్శి, కావ్య కళ్యాణ్ రామ్ లు హీరో హీరోయిన్స్ గా నటించారు.