ఎన్టీఆర్ స్మశానంలో పూజలు చేసి అక్కడే పడుకునేవారా!

నందమూరి తారక రామారావు గారు నటుడిగానే కాకుండా నిజజీవితంలో కూడా ఎంతో ఉన్నతమైన నైతిక విలువలు కలిగిన వ్యక్తి అనడంలో ఎటువంటి సందేహం లేదు. అందుకు నిదర్శనం ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాలనలో ఎన్నో ఉన్నత సంస్కరణలు ప్రవేశపెట్టి పేదవారికి అండగా నిలవడంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషి చేశారు.ఎన్టీఆర్ గారికి ఆధ్యాత్మిక భావనలు, దైవత్వం అంటే గొప్ప నమ్మకం ఉండేది. అలాగే భారతీయ సంస్కృతి, దైవ సిద్ధాంతాల పైన మంచి పరిజ్ఞానం ఉండేది.ఒకానొక సమయంలో ఆయన క్షుద్ర పూజలు చేస్తారంటూ, స్మశానలో పూజలు చేయడం రాత్రి పూట చీర కట్టుకుని స్మశానం లోనే పడుకునే వారంటూ అప్పట్లో వార్తలు గట్టిగా వినిపించాయి.

ఈ విషయంపై ప్రముఖ జర్నలిస్టు భరద్వాజ గారు స్పందిస్తూ అప్పట్లో ఎన్టీఆర్ గారిపై వచ్చిన ఈ వార్తలో ఎటువంటి నిజం లేదు కేవలం ఆరోపణలు మాత్రమే. ఆయన పేరును పాడు చేయడానికి ఆనాటి ప్రతిపక్షాలు చేసిన కుట్ర. నిజమైన ఎన్టీఆర్ ఆలోచనలు ఇప్పటికీ చాలా మందికి తెలియవు అంటూ తన ఆవేదనను మీడియా ముందు వ్యక్తపరిచారు.నిజమైన ఎన్టీఆర్ ఆలోచనలు తెలియాలంటే కుర్థళం పీఠాధిపతి ప్రసాదరాయ కులపతి ప్రస్తుతం మౌనస్వామి అని పిలిచే ఆయన ఒకసారి ఎన్టీఆర్ గారు ఇచ్చిన ప్రసంగం గురించి చెప్పి కొత్త ఎన్టీఆర్ ను లోకానికి పరిచయం చేసారు అంటూ భరద్వాజ గారు వివరించారు.

ఎన్టీఆర్ గారిపై త్రిపురనేని రామస్వామి గారి సిద్ధాంతాల ప్రభావం సినిమాల్లోనూ మరియు ఆయన పాలనలో తీసుకొచ్చిన సంస్కరణలో స్పష్టంగా కనిపిస్తుంది.ఎన్టీఆర్ గారిలో కొంత ద్రావిడ సిద్ధాంతపు ఆలోచనలు ఎక్కువ, ఆయనను ఆ వైపుగా ప్రభావితం చేసిన వ్యక్తి త్రిపురనేని రామస్వామి గారు అని చెప్పొచ్చు.ఎన్టీఆర్ గారికి సాహిత్యం, మన పురాణాల మీద మంచిపట్టు ఉండేది. అయితే చాలామంది ఎన్టీఆర్ గారికి కేవలం సినిమాల గురించి మాత్రమే తెలుసు పరిపాలన గురించి ఏం తెలుస్తుంది అంటూ ప్రచారం చేశారు. ఎన్టీఆర్ గారు ఓ సందర్భంలో బ్రాహ్మణ అంటే కులం కాదు, బ్రహ్మ జ్ఞానం తెలిసిన శూధ్రుడైనా బ్రాహ్మణుడే అంటూ శంకర పద్యం ను ఉదాహరించి దాదాపు రెండు గంటల పాటు భారతీయ సంస్కృతి వేదాల గురించి మాట్లాడారు. ఎన్టీఆర్ గారు మూఢనమ్మకాలను అస్సలు నమ్మేవారు కాదు. దైవత్వం అంటే మాత్రం అపారమైన నమ్మకం ఉండేది అంటూ భరద్వాజ గారు ఎన్టీఆర్ గొప్పతనాన్ని గురించి విశ్లేషించారు.