సరోగసి విధానం పై సంచలన ట్వీట్ చేసిన సీనియర్ నటి.. ఇండియాలో బ్యాన్ అంటూ ట్వీట్!

ప్రస్తుత కాలంలో వైద్యరంగం ఎంతో అభివృద్ధి చెందింది. ఈ క్రమంలోనే పిల్లలను కనడానికి సరోగసి పద్ధతి కూడా అభివృద్ధి చెందడంతో చాలా మంది సెలబ్రిటీలు పిల్లలను కనడం వల్ల భవిష్యత్తులో తమ కెరియర్ కు ఇబ్బంది పడుతుందన్న కారణం అలాగే ఇతర సమస్యల కారణంగా సరోగసి పద్ధతి ద్వారా పిల్లలను కనడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే మన ఇండస్ట్రీలో ఎంతోమంది ఇలా సరోగసి పద్ధతి ద్వారా తల్లిదండ్రులైన సెలబ్రిటీలు ఉన్నారు.తాజాగా నయనతార విగ్నేష్ దంపతులు కూడా సరోగసి పద్ధతి ద్వారా ఇద్దరు మగ పిల్లలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే ఈ విషయం తెలిసిన ఎంతోమంది అభిమానులు వీరికి శుభాకాంక్షలు తెలుపుతుండగా ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నటువంటి సీనియర్ నటి కస్తూరి ట్విట్టర్ వేదికగా చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సందర్భంగా ఆమె ట్వీట్ చేస్తూ ఇండియాలో సరోగసి బ్యాన్ అయ్యింది.. వైద్యపరంగా కొన్ని అనీవార్య కారణాల వల్ల తప్ప మిగిలిన సందర్భాలలో సరోగసిని ప్రోత్సహించకూడదని 2022లో ఈ చట్టం అమలులోకి వచ్చిందని తెలిపారు. రాబోయే రోజులలో ఈ విషయం గురించి మరింత తెలుసుకుంటారంటూ ఈమె ట్వీట్ చేశారు.

ఈ విధంగా కస్తూరి చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ ట్వీట్ లోఎక్కడా కూడా ఈమె నయనతార విగ్నేష్ పేరును ప్రస్తావించకపోయినా చాలామంది మాత్రం వారిని ఉద్దేశించే ఇలాంటి ట్వీట్ చేసిందని భావిస్తున్నారు.ఈ క్రమంలోనే కొందరు నాయనతార అభిమానులు ఈ విషయంపై స్పందిస్తూ మీరు మీ పని చూసుకుంటే బాగుంటుంది అంటూ కామెంట్లు చేశారు. ఈ విషయంపై కూడా ఈమె స్పందిస్తూ తాను ఎవరిని ఉద్దేశించి ఇలాంటి ట్వీట్ చేయలేదని ఎవరిని కించపరచాలని భావనతో తాను ఈ విషయాన్ని తెలియ చేయలేదని తెలిపారు. నేను లాయర్‌గా అర్హత సాధించిన వ్యక్తిగా చట్టపరమైన అంశాలపై విశ్లేషణ చేసే హక్కు నాకు ఉందని ఈ సందర్భంగా ఈమె తెలియపరిచారు.