జీవితంలో శత్రువులను కమెడియన్లుగా మాత్రమే చూడండి.. వైరల్ అవుతున్న కంగనా కామెంట్స్?

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్,కాంట్రవర్సీ కేరాఫ్ అడ్రస్ అయినటువంటి నటి కంగనా రౌనత్ గురించి పరిచయం అవసరం లేదు.బాలీవుడ్ ఇండస్ట్రీలో నెపోటిజం గురించి తరచూ తన గలం విప్పుతూ పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచే కంగనా సోషల్ మీడియా ఎలాంటి చిన్న పోస్ట్ పెట్టిన క్షణాల్లో వైరల్ అవుతుంది. అయితే ఈమె ఏ విషయం గురించి అయినా మాట్లాడాలన్నా ఎవరి గురించి అయినా పోస్ట్ చేయాలన్న ఏమాత్రం వినపడకుండా తన మనసులో ఉన్నది ఉన్నట్టు బయట పెట్టడం వల్ల ఈ వ్యాఖ్యలు పెద్ద ఎత్తున వివాదాలకు దారితీస్తాయి.

ఈ విధంగా కంగనా సినిమాలకు సంబంధించిన విషయాల గురించి మాత్రమే కాకుండా రాజకీయాలకు సంబంధించిన విషయాలు పై కూడా స్పందిస్తూ పెద్ద వివాదాలకు తెర లేపుతుంటారు. ఇకపోతే ఈమె మహిళలకు ఎంతో మద్దతు తెలుపుతూ, మహిళల అభివృద్ధి కోసం ఎన్నో సలహాలు సూచనలు కూడా చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే మహిళలు టైం వచ్చే వరకు ఎదురు చూడకూడదని, వారికి వారే ఒక టైం క్రియేట్ చేసుకోవాలి అంటూ చెప్పుకొచ్చారు. ఇలా తనకు తోచినది మాట్లాడటం వల్ల ఈమెకు ఎంతోమంది అభిమానులతో పాటు ఈమెను విమర్శించేవారు ఈమెకు శత్రువులు కూడా అధికంగానే ఉన్నారు.

ఈ విధంగా ఈమెను విమర్శించేవారు అధికమవడంతో ఆ విమర్శలను కూడా ఈమె తనకు అనుగుణంగా మార్చుకొని ఇంకా ముందుకు వెళ్తున్నారు. జీవితంలో ఎదురయ్యే విమర్శలను మీ ఎదుగుదల కోసం ఉపయోగించుకోండి అలా ఎదుగుతున్న సమయంలో శభాష్ అన్న వారిని, మిమ్మల్ని అభిమానించే వారిని చూసి ఆనందించండి… అలాగే మీకు జీవితంలో ఎవరైతే శత్రువులుగా ఉంటారో అలాంటి వారిని ఎప్పుడు మీరు కమెడియన్లగానే చూడండి అంటూ ఈమె చెప్పుకొచ్చారు. ఈ విధంగా ఈమె చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవ్వడంతో ఎంతోమంది నెటిజన్లు ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ శభాష్ అంటూ తనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.