Manchu Vishnu : విష్ణుతో సినిమా కి సాయి పల్లవి నో చెప్పడానికి గల కారణాలు ఇవేనా ?

Manchu Vishnu: మోహన్ బాబు వారసుడిగా పరిశ్రమకు గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చాడు మంచు విష్ణు. అయితే ఆశించింత స్థాయిలో హీరోగా మాత్రం నిలబడలేదు. ఢీ, దూసుకెళ్తా వంటి సినిమాలు పర్వాలేదనిపించిన మిగతా సినిమాలు ప్లాప్ అయ్యాయి. ఇక ఈ మధ్యనే మా అధ్యక్షుడిగా గెలిచినా విష్ణు మళ్ళీ సినిమాలపై దృష్టి పెట్టారు.

ఆయన నటించబోతున్న కొత్త చిత్రం గాలి నాగేశ్వర్ రావు.హాస్య ప్రధానంగా సాగబోతొందట ఈ చిత్రం. ఇందులో హీరోయిన్ గా పాయల్ రాజ్ పూత నటిస్తోంది. గాలి నాగేశ్వర్ రావు సినిమా కథ, కథనం నాగేశ్వర్ రెడ్డి అందించారు. ఈషన్ సూర్య దర్శకత్వం వహించబోతున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతమందించబోతున్నారు.

ఈ చిత్రానికి మొదట ఫిదా హీరోయిన్ సాయి పల్లవిని హీరోయిన్గా అనుకున్నారట అయితే మారన్ బ్యూటీ సాయి పల్లవి 2.5 కోట్లు డిమాండ్ చేసిందట. అంత మొత్తం ఇచ్చుకోలేమని చెప్పారట నిర్మాత. దాంతో సాయి పల్లవి ఈ ఆఫర్ ను వద్దనుకుందట.ఇక చేసేదేమి లేక పాయల్ రాజ్ పుత్ తో సరిపెట్టుకుంటున్నాడు విష్ణు. ఇక ఈ సినిమాలో మరో కీలక పాత్ర కోసం సన్నీ లియోన్ ని ఎంచుకున్నారట చిత్ర యూనిట్