హాస్పిటల్ నిర్మాణం చేయబడుతున్న సాయి పల్లవి.. ఇక పై సినిమాలకు దూరం కానందా?

సౌత్ సినిమా ఇండస్ట్రీలో న్యాచురల్ బ్యూటీ క్విన్ సాయి పల్లకి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదని చెప్పొచ్చు. సాయి పల్లవి అద్భుతమైన డాన్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకుని తెలుగు తమిళ్ మలయాళ భాషల్లో పలు విజయవంతమైన సినిమాలో నటించి ఎంతో ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. హీరోయిన్ సాయి పల్లవి తెలుగులో ఫిదా, మిడిల్ క్లాస్ అబ్బాయి, కణం వంటి పలు విజయవంతమైన సినిమాల్లో నటించింది.

సాయి పల్లవి వైద్య విద్యను అభ్యసించినప్పటికీ నటన మీద ఆసక్తితో పలు టీవీ ఛానల్లో డాన్స్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ద్వారా మంచి గుర్తింపు రావడంతో అనుకోకుండా ప్రేమమ్‌ అనే మలయాళ చిత్రం ద్వారా కథానాయకిగా ఇండస్ట్రీకి పరిచయమైంది. అప్పటినుంచి ఇప్పటివరకు దక్షిణాది చిత్రాల్లో బిజీ కథానాయక మారింది. కొంతకాలంగా సాయి పల్లవి వెండితెర పైన అటు సోషల్ మీడియాలోనూ తక్కువగా కనిపిస్తోందంటూ సాయి పల్లవి అభిమానులతో పాటు సినీ ఇండస్ట్రీలో చర్చ సాగుతోంది.సాయి పల్లవి మల్టీ టాలెంటెడ్ అని మనందరికీ తెలుసు సినిమాల్లో హీరోయిన్గా ప్రేక్షకులను అలరిస్తూనే తనకి ఇష్టమైన డాక్టర్ వృత్తిని చేపట్టి పేద ప్రజలకు వైద్య సహాయం అందించాలన్నది ఆమె కోరిక.

అసలు విషయానికి వస్తే సాయి పల్లవి కొంతకాలంగా సినిమా ఇండస్ట్రీకి, సోషల్ మీడియాలో కనిపించక పోవడానికి కారణం సాయి పల్లవి కోయంబత్తూరులో ఒక పెద్ద హాస్పిటల్ నిర్మించడానికి కావలసిన స్థలం అనుమతుల కోసం ప్రయత్నాల్లో భాగంగానే ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. సాయి పల్లవి వీలైనంత త్వరగా హాస్పిటల్ నిర్మించి ప్రజలకు సేవ చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం సాయి పల్లవి చేతినిండా సినిమాలు ఉన్నప్పటికీ హాస్పిటల్ ఎందుకు నిర్మిస్తుందో అన్న సందేహం చాలామందికి కలుగుతుంది. అయితే సాయి పల్లవి మాత్రం నటిగా తాను బిజీగా ఉంటే హాస్పిటల్ బాధ్యతలను తన చెల్లెలికి అప్పగించవచ్చని సాయి పల్లవి భావిస్తోందట.