నాగబాబు కన్నా రోజాకి రెమ్యూనరేషన్ ఎక్కువ ఇవ్వటానికి కారణం అదే: ఏడుకొండలు

Nagababu About Adirindi And JaBardasth

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా జబర్దస్త్ గురించి చర్చ జరుగుతుంది. కిరాక్ ఆర్పీ జబర్దస్త్ గురించి చేసిన వ్యాఖ్యల వల్ల ఒక్కొక్కరు బయటకి వస్తూ జబర్దస్త్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో మొదట ఆది, రాంప్రసాద్ ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చి జబర్దస్త్ గురించి అక్కడ జరిగే విషయాల గురించి క్లారిటీ ఇచ్చారు. ఆ తర్వాత మరొక జబర్దస్త్ ఆర్టిస్ట్ షేకింగ్ శేషు కూడా యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యు ఇచ్చి ఆర్పి గురించి షాకింగ్ విషయాలు వెల్లడించారు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గురించి, జబర్దస్త్ గురించి ఆర్పి చెప్పినవన్నీ నిజాలు కాదని తెలియచేశాడు.

తాజాగా జబర్దస్త్ డైరక్టర్ ఏడుకొండలు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. గతంలో మల్లెమాల సంస్థలో ఎన్నో ఏళ్ళు మేనేజర్ గా అనుభవం ఉన్న ఏడుకొండలు వ్యక్తిగత కారణాల వల్ల కొంతకాల క్రితం మల్లెమాల నుండి బయటికీ వచ్చాడు. అయితే ఇటీవల జబర్దస్త్ గురించి, శ్యాం ప్రసాద్ రెడ్డి గురించి ఆర్పి చేసిన వ్యాఖ్యలపై స్పందించడానికి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ క్రమంలో ఏడుకొండలు జబర్దస్త్ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. అలాగే శ్యాం ప్రసాద్ రెడ్డి గారి గొప్పతనం గురించి ఈ సందర్భంగా ఆయన తెలియజేశాడు. అంతేకాకుండా కొందరు జబర్దస్త్ ఆర్టిస్టుల గురించి కూడా ఏడుకొండలు సంచలన వ్యాఖ్యలు చేశాడు.

ఈ క్రమంలో రోజా, నాగబాబు గారి రెమ్యూనరేషన్ విషయంలో తేడా గురించి యాంకర్ అడగగా.. ఏడుకొండలు స్పందిస్తూ.. ఒక హీరోయిన్ కి సపోర్టింగ్ క్యారెక్టర్ కి మధ్య తేడా ఉంటుంది. రోజా ఒక స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన వ్యక్తి. నాగబాబు సపోర్టింగ్ రోల్స్ మాత్రమే చేసే వ్యక్తి. అందువల్ల రోజాకి రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇచ్చేవారు అని చెప్పుకొచ్చాడు. షో మొదలుపెట్టేటప్పుడే ఇద్దరికీ రెమ్యూనరేషన్ గురించి పూర్తిగా వివరించామని, వారు కూడా ఒక అమౌంట్ కి ఒప్పుకున్న తర్వాత పని ప్రారంభించినట్టు వెల్లడించాడు. ఈ క్రమంలో జబర్దస్త్ నుండి బయటికి వెళ్ళిన వారిని ఉద్దేశిస్తూ ఏడుకొండలు సంచలన వ్యాఖ్యలు చేశాడు.