Rohit Sharma – Suryakumar Yadav: రోహిత్ – సూర్య జోడి ధాటికి సన్‌రైజర్స్ బోల్తా!

ఐపీఎల్ 2025లో ముంబయి ఇండియన్స్ జట్టు ఫామ్‌లోకి వచ్చేసింది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న ముంబయి తాజా మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఆత్మవిశ్వాసాన్ని చాటుకుంది. ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈ పోరులో ముంబయి 7 వికెట్ల తేడాతో సునాయాస విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ జట్టును ముంబయి బౌలర్లు చిత్తు చేశారు.

SRH ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు జెట్ స్పీడ్ లోనే తిరిగి పోవడంతో ఆ జట్టు ఒత్తిడిలో పడింది. 13 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయిన సన్‌రైజర్స్‌కు హెన్రిచ్ క్లాసెన్, అభినవ్ మనోహర్‌లు ఊపిరి పోశారు. ఈ జోడి 99 పరుగుల భాగస్వామ్యం నిర్మించింది. క్లాసెన్ 71 పరుగులు చేయగా, అభినవ్ 43 పరుగులు చేశాడు. కానీ మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమవడంతో స్కోరు 143/8కే పరిమితమైంది. బౌలర్లలో బౌల్ట్ 4 వికెట్లు పడగొట్టి అదరగొట్టాడు.

లక్ష్య ఛేదనలో ముంబయి జట్టు ఆరంభం నుంచి దూకుడుగా ఆడింది. రోహిత్ శర్మ తన క్లాసిక్ ఆటతో మరో అర్ధశతకం (70) నమోదు చేశాడు. 46 బంతుల్లో వచ్చిన అతని ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లు ఉన్నాయి. రోహిత్‌కు సహకరిస్తూ సూర్యకుమార్ యాదవ్ 40 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. వీరిద్దరి భాగస్వామ్యం ముంబయికి గెలుపు అందించింది. ముంబయి 15.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది.

ఈ విజయంతో ముంబయి పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. నెట్ రన్‌రేట్‌ను మెరుగుపరుచుకుంది. వరుసగా నాలుగు విజయాలతో జట్టు మళ్లీ టైటిల్ రేసులోకి వచ్చినట్టే. మరోవైపు, సన్‌రైజర్స్ మాత్రం వరుస పరాజయాలతో కష్టాల్లో పడింది. టాప్ ఆర్డర్ వైఫల్యం ఆ జట్టుకు సమస్యగా మారింది. నెక్స్ట్ జరగబోయే మ్యాచ్‌ల్లో SRH మెరుగైన ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉంది. లేదంటే ప్లే అప్స్ వదులుకోవాల్సిందే.

విజయసాయి పిట్టకథ || Ks Prasad on AP Liquor Scam Issue | Raj Kasireddy | Vijay Sai Reddy || TR