సీబీఐ ఇన్వెస్టిగేషన్ రూమ్ లో సుశాంత్ మర్డర్ గురించి రియాని పోలీసులు అడిగిన మొట్టమొదటి ప్రశ్న ఇదే..!

Rhea chakraborty attends cbi enquiry on sushant death case

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసు ఎన్నో ట్విస్టులు తిరుగుతోంది. ఎట్టకేలకు ఈ కేసు సీబీఐ చేతికి రావడంతో సీబీఐ అధికారులు ఎలాగోలా అసలు నిజాలు రాబట్టే పనిలో పడ్డారు. ఇప్పటికే సుశాంత్ ఇంటికి వెళ్లి అక్కడ సీన్ రీ కన్ స్ట్రక్ట్ చేసిన సీబీఐ అధికారులు.. సుశాంత్ ఫ్రెండ్స్, ఇరుగు పొరుగు వాళ్లను ప్రశ్నించారు.

Rhea chakraborty attends cbi enquiry on sushant death case
Rhea chakraborty attends cbi enquiry on sushant death case

తాజాగా ఎన్నో అనుమానాలకు తావిచ్చిన సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తిని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ముంబైలోని డీఆర్డీవో అతిథి గృహంలో రియా చక్రవర్తిని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. దాదాపు రియాను గంటన్నర పాటుగా అధికారులు ప్రశ్నించినట్టు సమాచారం.

సుశాంత్ తో రియాకు పరిచయం ఎలా జరిగింది.. ప్రేమ, ఇద్దరి మధ్య డబ్బుకు సంబంధించిన లావాదేవీలు, బ్యాంకు ఖాతాలు, సుశాంత్ ఖాతా నుంచి ఏ ఖాతాలకు డబ్బులు ట్రాన్స్ ఫర్ అయ్యాయి.. లాంటి విషయాలన్నింటినీ సీబీఐ అధికారులు రియా నుంచి రాబట్టారు.

మీరు సుశాంత్ ను పెళ్లి చేసుకోవాలనుకున్నారా? అని కూడా రియాను సీబీఐ అధికారులు ప్రశ్నించినట్టు తెలుస్తోంది. అయితే.. ఆ ప్రశ్నకు రియా ఏం సమాధానం చెప్పిందే మాత్రం తెలియదు.

మరోవైపు సుశాంత్ కేసులోనే రియా సోదరుడు షోవిక్ చక్రవర్తిని కూడా అధికారులు విచారించారు. ఆయనతో పాటుగా సుశాంత్ తో సన్నిహితంగా ఉన్నవాళ్లందరినీ సీబీఐ ప్రశ్నిస్తోంది.

సుశాంత్ మేనేజర్ సిద్ధార్థ్ పితాని, సుశాంత్ వంటమనిషి నీరజ్ సింగ్, పనిమనిషి కేశ్, సుశాంత్ ఇంటి మేనేజర్ శామ్యూల్ మిరిండాను కూడా సీబీఐ అధికారులు ప్రశ్నించినట్టుగా సమాచారం. అయితే.. వీళ్లందరూ సీబీఐకి సుశాంత్ కేసు గురించి ఏం చెప్పారు అనేది తెలియాల్సి ఉంది.

మరోవైపు సుశాంత్ బ్యాంక్ అకౌంట్ నుంచి 15 కోట్లు కనిపించకుండా పోవడంపై సుశాంత్ తండ్రి కేకే సింగ్ కేసు కూడా పెట్టారు.

రియాకు డ్రగ్స్ మాఫియాతో ఉన్న సంబంధాల గురించి కూడా సీబీఐ ఆఫీసర్లు ఆరా తీశారు. అయితే.. వీళ్లందరూ సీబీఐకి ఏం చెప్పారు? తర్వాత ఏం జరగబోతోంది? సీబీఐ అధికారుల తదుపరి కర్తవ్యం ఏంటో తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

సుశాంత్ తనకు కలలో కనిపించాడని.. ఇప్పటికైనా బయటికి వచ్చి నిజాన్ని నిర్భయంగా చెప్పాలంటూ సుశాంత్ చెప్పాడని చెప్పి రియా చక్రవర్తి ఇటీవలే మీడియా ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అంతకు ముందు ఎప్పుడూ మీడియా ముందుకు రాని రియా.. సీబీఐ అధికారుల ఎంక్వయిరీకి ముందే మీడియాతో మాట్లాడటం పలు అనుమానాలకు తావిస్తోంది.