షాకింగ్ : మరోసారి తన ఆవేదన వెళ్లగక్కిన రేణు దేశాయ్..!

టాలీవుడ్ సినిమా ప్రముఖ నటి అలాగే డిజైనర్ అయినటువంటి రేణు దేశాయ్ కోసం ఆమె పర్శనల్ లైఫ్ కోసం అందరికీ తెలిసిందే. టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాను వైవాహికంగా విడిపోయి ఎన్నో ఏళ్ళు అయినప్పటికీ ఆమెకి మాత్రం చాలా రకాలుగా ఇబ్బందులు అలా కొనసాగుతూనే ఉన్నాయి.

మెయిన్ గా పాలిటిక్స్ విషయంలో రేణు దేశాయ్ చాలా అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే పొలిటికల్ పరంగా తమ పర్శనల్ లైఫ్ ని ఎప్పుడు లాగొద్దని అసలు పాలిటిక్స్ కి అవతల వాళ్ళ వ్యక్తిగత జీవితానికి ఏం సంబంధం అని వాగ్వాదం చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు మళ్ళీ ఆమె సోషల్ మీడియాలో తన ఆవేదన వెళ్లగక్కారు.

అసలు రాజకీయాల్లోకి సినిమా వాళ్ళ పర్శనల్ లైఫ్ ని ఎందుకు లాగుతున్నారు? అని వాటి వల్ల సమాజానికి ఏమన్నా నష్టం వచ్చిందా అని ప్రశ్నించారు. అలాగే అసలు జర్నలిజం అంటే ఏంటి ఇలా అవతల వాళ్ళ వ్యక్తిగత జీవితాల కోసం మాట్లాడుకుంటూ కూర్చొని షో చేయడమా?సినిమా వాళ్ళ పర్శనల్ లైఫ్ వల్ల సమాజానికి శాంతి భద్రతలకు ఏమన్నా నష్టం వచ్చిందా? అలాంటప్పుడు ఎందుకు ప్రతిసారి లాగుతున్నారని అన్నారు.

అలాగే సినిమా వాళ్ళు లేకపోతె ఒక శుక్రవారం సినిమా రాకపోయినా ప్రేక్షకులు మూవీ లవర్స్ ఇబ్బంది పడతారు. 95 శాతం మంది సినిమా ఎంటర్టైన్మెంట్ రంగం మూలానే ఎంటర్టైన్ అవుతున్నారు. ఇండస్ట్రీ వాళ్ళు అంటే సాఫ్ట్ గా ఉంటారని ఇలా ఏది పడితే అది వాళ్ళ కోసం న్యూస్ లు చేస్తున్నారని రేణు దేశాయ్ ఆగ్రహం ఆవేదన వ్యక్తం చేశారు. దీనితో ఆమె పోస్ట్ మళ్ళీ వైరల్ గా మారింది.