పంజాబ్‌లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ర‌చ్చ .. భ‌యంతో ప‌రుగులు పెడుతున్న ప్ర‌జ‌లు

నంద‌మూరి వార‌సుడిగా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఇప్పుడు టాలీవుడ్‌ని ఏలేస్తున్నాడు. స్టార్ హీరోల‌లో ఒక‌రిగా ఉన్న ఎన్టీఆర్ ప్ర‌స్తుతం ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో కొమురం భీంగా న‌టిస్తున్న ఎన్టీఆర్‌కి సంబంధించి ఇటీవ‌ల ఓ వీడియో విడుద‌లైంది. ఇందులో జూనియర్ లుక్ ఫ్యాన్స్ మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది. సినిమా ఎప్ప‌డెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ లో తెగ ఆస‌క్తిని క‌లిగించింది.

జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు కేవ‌లం తెలుగు రాష్ట్రాల‌లోనే కాదు చుట్టు ప‌క్క‌ల రాష్ట్రాల‌లోను భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తాజా వీడియోతో ఇది మ‌రోసారి నిర్ధార‌ణ అయింది. బాబీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన జై ల‌వ‌కుశ చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం పోషించి ఎంతగానో అల‌రించాడు. ఈ సినిమాలో `రావ‌ణా..జై జై జై..` అనే పాట చాలా హిట్ అయింది.ఈ పాట ఇప్పుడు పంజాబ్‌లోను హ‌ల్ చ‌ల్ చేస్తుంది. రావ‌ణుడి గెట‌ప్‌లో ఉన్న కొంద‌రు వ్య‌క్తులు జీపులో వ‌చ్చి వీధుల్లో తిరుగుతూ ప్ర‌జ‌ల‌ని హ‌డ‌లెత్తిస్తున్నారు. బ్యాక్ గ్రౌండ్‌లో రావ‌ణా అనే సాంగ్ ప్లే అవుతుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తుంది.

జై ల‌వుకుశ చిత్రానికి సంగీతం అందించిన దేవి శ్రీ ప్ర‌సాద్ ఈ వీడియోకి ఫిదా కాగా, దీనిని రీ ట్వీట్ చేశారు. దీంతో ఇది తెలుగు ప్రేక్ష‌కుల కంట కూడా ప‌డింది. ఎన్టీఆర్ అభిమానులు ఈ వీడియో చూసి తెగ న‌వ్వుకుంటున్నారు. అలానే ఇత‌ర రాష్ట్రాల‌లో త‌మ అభిమాన హీరో సాంగ్‌కు ఇంత క్రేజ్ ఉండ‌డంతో సంతోషిస్తున్నారు. కాగా, అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందిన ఎన్టీఆర్ ఇటీవ‌ల అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న అభిమానిని వీడియో కాల్ ద్వారా ప‌రామ‌ర్శించిన సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లోనే క‌లిసి సెల్ఫీ కూడా దిగుదాం అని ఆ అభిమాని మాట ఇవ్వ‌డంతో అభిమాని ఆనందం క‌ట్టలు తెంచుకుంది.