మొదటిసారి ట్రోల్స్ పై స్పందించి ఘాటుగా సమాధానం చెప్పిన రష్మిక.. వైరల్ అవుతున్న పోస్ట్?

నేషనల్ క్రష్ రష్మిక మందన్నఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తర్వాత అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని అగ్రతారగా పేరు ప్రఖ్యాతలు పొందారు. ఇలా ఇండస్ట్రీలో భాషతో సంబంధం లేకుండా అన్ని భాషలలో సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇలా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నటువంటి ఈమె సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఇకపోతే ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నటీనటులపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరగడం సర్వసాధారణం.

ఈ క్రమంలోనే రష్మిక గురించి ఎంతోమంది ఎన్నోసార్లు నెగిటివ్ కామెంట్లతో ట్రోల్ చేశారు. అదే విధంగా ఈమె గురించి లేనిపోని వార్తలు సృష్టించడం చేయడంతో ఇన్ని రోజులపాటు ఓపికగా భరించినటువంటి ఈమె ఒక్కసారిగా తన సహనం కోల్పోవడంతో సోషల్ మీడియా వేదికగా తనపై ట్రోల్ చేసే వారికి తనదైన స్టైల్ లో వార్నింగ్ ఇచ్చారు.ఇన్ని రోజులు ఓపికగా భరించాను ఇక నాకు ఓపిక లేదు ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఇలాంటివన్నీ సర్వసాధారణం అయితే మరీ రెచ్చిపోయి తన గురించి ట్రోల్ చేస్తున్నారని ఇప్పటివరకు స్పందించకుండా తాను తప్పు చేశానంటూ ఈమె వెల్లడించారు.

నేను ఏ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆ మాటలను కొందరు వ్యతిరేకంగా తీసుకొని ట్రోల్ చేస్తున్నారని ఈమె బాధపడ్డారు. ఇక మరికొందరు నేను చేసిన పోస్టుల పట్ల కొంతమంది ఎగతాళిగా మాట్లాడటమే కాకుండా పిచ్చిపిచ్చి కామెంట్లు చేస్తున్నారు. అవి నా మనసును చాలా బాధ పెట్టడమే కాకుండా నన్ను నిరుత్సాహపరుస్తున్నాయని తెలిపారు. ఇలా నాపై ఇంత ద్వేషం ఏంటి?ఇప్పటివరకు ఈ విషయాల గురించి మాట్లాడకుండా తప్పు చేశాను ఇప్పుడు కూడా మాట్లాడకపోతే మరింత రెచ్చపోతారన్న ఉద్దేశంతో తాను స్పందిస్తున్నారని తెలిపారు. నేను నచ్చకపోయినా నా సినిమాలు నచ్చకపోయినా చూడటం మానేయండి అంతేకానీ ఇలాంటి కామెంట్లతో బాధపెట్టకండి అంటూ ఈ సందర్భంగా ఈమె మొదటిసారి ట్రోలర్స్ గురించి స్పందిస్తూ తనదైన స్టైల్ లో వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఈమె చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.