రష్మిక పట్టిందల్లా బంగారమేనట!

Rashmika

ఎస్.. మీరు వింటున్నది నిజమే.  క్రేజీ బ్యూటీ రష్మిక మందన్న టాలీవుడ్ లో టాప్ లో దూసుకెళుతోంది. ఆమె పట్టిందల్లా బంగారం అవుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్నఈమె గొప్ప అవకాశాల్నిసైతం అందుకుంటోంది. అగ్ర హీరోలతో జోడీకడుతూ చలాకీ నటనతో ఆకట్టుకుంటోంది.

Rashmika

తాజాగా రష్మిక రామ్‌చరణ్‌ సరసన నటించబోతున్నట్లు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.  చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఆచార్య’.  సందేశాత్మక కథాంశానికి వాణిజ్య హంగులను జోడిస్తూ తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ అతిథి పాత్రలో కనిపించబోతున్నారు. ఎక్కువ నిడివితో కూడిన ఈ  అతిథి పాత్రలో రామ్‌చరణ్‌కు జోడీగా రష్మిక నటించనున్నట్లుసమాచారం.  దర్శకుడు తన పాత్ర తీర్చిదిద్దిన తీరు నచ్చడంతో ఆమె ఈ సినిమాలో నటించడానికి ఓకే చేసినట్లు చెబుతున్నారు. వచ్చే నెలలో ఈ సినిమా చిత్రీకరణ పునఃప్రారంభంకాబోతోంది.

ప్రస్తుతం అల్లు అర్జున్‌-సుకుమార్‌ ‘పుష్ప’ సినిమాలో రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది. తాజాగా రామ్‌చరణ్‌కు జోడీగా రష్మిక నటిస్తున్నట్టు వార్త ఫిలింనగర్ లో జోరుగా షికారు చేస్తోంది.