బాలీవుడ్ టాక్ షో లో సందడి చేయనున్న రష్మిక, అల్లు అర్జున్.. తగ్గేదే లే అంటున్న బన్నీ!

అల్లు అర్జున్ రష్మిక మందన పుష్ప సినిమా ద్వారా పాన్ఇండియా స్థాయిలో మంచి ఆదరణ సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే నార్త్ ఇండియాలో ఈ జంటకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.పుష్ప సినిమా ద్వారా బాలీవుడ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న రష్మికకు బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు వస్తున్నాయి. ఈ విధంగా పుష్ప సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ జంటకు బాలీవుడ్ టాక్ షో కాఫీ విత్ కరణ్ కార్యక్రమంలో భాగంగా నిర్మాత కరణ్ జోహార్ తో ముచ్చటించటానికి సిద్ధమయ్యారు.

ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో అద్భుతమైన టాక్ షో గా పేరు సంపాదించుకున్న కాఫీ విత్ కరణ్ ఈ కార్యక్రమానికి ఎంతో మంది బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరై వారి వ్యక్తిగత విషయాల గురించి అభిమానులకు తెలియజేస్తారు. ఇప్పటివరకు ఆరు సీజన్లు బుల్లితెరపై ప్రసారమైన ఈ షో ఇకపై ఏడవ సీజన్ బుల్లి తెరపై కాకుండా ఓటీటీలో ప్రసారం అవుతుందని స్వయంగా బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ వెల్లడించారు.

ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం త్వరలోనే ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి పుష్ప ఫేమ్ అల్లు అర్జున్, రష్మికను అతిథులుగా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఈ విధంగా నిర్మాత కరణ్ జోహార్ నుంచి వీరికి పిలుపు రావడంతో ఈ హీరో హీరోయిన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.బాలీవుడ్ ఇండస్ట్రీలో పుష్ప రాజ్ కి ఉన్న క్రేజ్ ను కరణ్ జోహార్ క్యాష్ చేసుకుని ఈ కార్యక్రమానికి వారిని ఆహ్వానిస్తున్నారు.ఇక ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీలో వీరికి మరింత క్రేజ్ ఏర్పడుతుందన్న ఉద్దేశంతో అల్లు అర్జున్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి చాలా ఆసక్తి కనబరుస్తున్నట్టు తెలుస్తోంది.