రానా కి పవన్ కళ్యాణ్ కావాలి.. హీరోయిన్ ఎందుకు ..?

రానా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసి మలయాళ సూపర్ హిట్ సినిమా అయ్యప్పనుం కోషియం తెలుగు రీమేక్ లో నటించబోతున్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఈ భారీ మల్టీస్టారర్ గురించి రక రకాల వార్తలు వచ్చి హాట్ టాపిక్ అయింది. పవన్ కళ్యాణ్ తప్ప ఈ సినిమా తెలుగు రీమేక్ లో మరో హీరో ఉండడని తెలుగు స్క్రిప్ట్ అలాగే మార్పులు చేర్పులు చేశారని రూమర్స్ వచ్చాయి. రానా కూడా ఈ సినిమాలో నటించడానికి అంతగా ఆసక్తి చూపించడం లేదన్న న్యూస్ కూడా బాగా స్ప్రెడ్ అయింది. కానీ తాజాగా మేకర్స్ ఈ సినిమాలో రానా నటిస్తున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేయడం తో పాటు ఘనంగా సినిమా ప్రారంభోత్సవం కూడా చేశారు.

Rana Daggubati to act in the Telugu remake of Ayyappanum Koshiyum കോശിയായി  റാണ ദഗ്ഗുബട്ടി

ఈ సినిమా మలయాళంలో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ళు రాబట్టింది. దాంతో ఈ సినిమాని త్రివిక్రం సితార వాళ్ళని రీమేక్ రైట్స్ కొనుగోలు చేయమని సలహా ఇచ్చాడట. అలాగే ఈ సినిమాకి రీమేక్ రైట్స్ తీసుకున్నారు. అంతేకాదు ఇప్పుడు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ – రానా దగ్గుబాటి హీరోలనగానే ప్రేక్షకుల తో పాటు ఇండస్ట్రీ వర్గాలలోనూ భారీగా అంచనాలు నెలకొన్నాయి.
ఇక ఈ సినిమాలో అయ్యప్పన్ నాయర్, పృథ్వీరాజ్ సుకుమారన్ క్యారెక్టర్‌ల తోనే సినిమా కథ మొత్తం సాగుతుంది.

Pawan Kalyan to star in 'Ayyappanum Koshiyum' Telugu remake, Venky Atluri  to direct | The News Minute

కాగా తెలుగు వెర్షన్ లో పవన్ కళ్యాణ్ అయ్యప్పన్ నాయర్ పాత్రలో ఓ నిజాయితీగల పవర్ ఫుల్ పోలీస్ ఆపీసర్ గా నటించనున్నారు. అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రలో రానా నటించనున్నారు. అంతేకాదు జనవరి నుంచి సినిమా షూటింగ్ కూడా మొదలవబోతుండటం తో మిగతా నటీ నటులను ఎంపిక చేస్తూన్నారట. ఈ క్రమంలోనే రానా తండ్రిగా తమిళ నటుడు సముద్ర ఖని నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ పాత్రకి సినిమాలో ఎంతో ప్రాధాన్యం ఉంది.

అయితే ఈ సినిమాలో రానా పాత్ర కి హీరోయిన్ ఉండదని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమన్నది క్లారిటీ లేనప్పటికి రానా మాత్రం పవన్ కళ్యాణ్ తో కలిసి నటించడమే ఇంకా నమ్మలేకపోతున్నానని ఎప్పుడెప్పుడు ఇద్దరం కలిసి సెట్స్ లో అడుగుపెడతామా అన్న ఆతృతగా ఉన్నానని అంటున్నాడు. అంతేకాదు ఈ సినిమాలో తన క్యారెక్టర్ కి హీరోయిన్ లేకపోయినా నో ప్రాబ్లం అంటున్నాడట.