సైలెంట్‌గా వ‌చ్చి సెట్ అయిన ర‌కుల్‌.. కోట్ల విలువ చేసే ఆస్తులు ఏంటో తెలుసా?

సైలెంట్‌గా వ‌చ్చి స్టార్ హీరోయిన్ రేంజ్‌కు వెళ్ళిన అందాల ముద్దుగుమ్మ ర‌కుల్ ప్రీత్ సింగ్. తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల‌లో వ‌రుస సినిమాలు చేస్తున్న పోతున్న ఈ అమ్మ‌డు దీపం ఉండ‌గానే ఇల్లు చక్క‌బెట్టుకుంటుంది. ఓ వైపు సినిమాలు మ‌రోవైపు బిజినెస్‌ల‌తో మూడు పువ్వులు ఆరు కాయ‌లు అన్న చందంగా సాగుతోంది. ఇటీవ‌ల ఈ అమ్మ‌డి పేరు మాదక ద్ర‌వ్యాల కేసులో వినిపించ‌గా త‌ర్వాత నిర్ధోషి అని తేల్చారు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఈ సుందరి పలు విజయవంతమైన చిత్రాల్లో కథానాయికగా న‌టించిన‌ ప్రేక్షకుల మన్ననలు సొంతం చేసుకుంది.

ప్రస్తుతం ర‌కుల్ ప్రీత్ సింగ్‌.. చెక్, వైష్ణవ్ తేజ్- క్రిష్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన చిత్రం, జాన్ అబ్ర‌హంతో ఒక‌టి, అర్జున్ క‌పూర్‌తో మ‌రో చిత్రం చేస్తుంది. ఇవే కాక అమితాబ్ బ‌చ్చ‌న్- అజ‌య్ దేవ‌గ‌ణ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్క‌నున్న మేడే చిత్రంలోను ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇవే కాక‌ రెండు త‌మిళ సినిమాలు కూడా ఉన్నాయి. సినిమాల‌లో సంపాదించిన కాసుల‌ని బిజినెస్‌లో పెట్టి రెండు చేతులా బాగానే సంపాదిస్తుంది. అయితే ఇప్పుడు ఈమె ద‌గ్గ‌ర మూడు అత్యంత విలువైన వ‌స్తువులున్నాయ‌ని ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతుంది.

తెలుగు సినిమాల‌తో బిజీగా ఉన్న స‌మ‌యంలో ర‌కుల్ ప్రీత్ సింగ్ హైద‌రాబాద్‌లో మూడు కోట్ల విలువ చేసే ఇల్లు కొంది. దాదాపు 16 వేల స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంలో ఈ ఇల్లు ఉంటుంద‌ట‌. దీంతో పాటు ఇక్క‌డ రెండు జిమ్స్ కూడా ఉన్నాయి. విశాఖ‌ప‌ట్నంలోను ర‌కుల్‌కు జిమ్ ఉంది.అంటే మొత్తం మూడు జిమ్స్ రకుల్ పేరు మీదున్నాయి. వీటి విలువ కూడా కోట్లలోనే ఉంటుందని తెలుస్తుంది. అలానే ఓ డైమండ్ రింగ్ కూడా ఈమె ద‌గ్గ‌ర ఉన్న‌ద‌ని స‌మాచారం. కొన్నేళ్ల కింద‌ట దీనిని కొన్న‌ట్టు తెలుస్తుంది. ప‌క్కా ప్రణాళిక‌తో ముందుకు సాగుతున్న ర‌కుల్ త‌న సోద‌రుడిని కూడా సినిమాల‌లోకి తీసుకొచ్చింది. అమ్మ‌డి ప్లాన్ చూసి మిగ‌తా హీరోయిన్స్ అవాక్క‌వుతున్నారు.