అందం కోసం ఆరాట పడి అనారోగ్యం పాలైన రకుల్.. ఆందోళనలో అభిమానులు!

వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైన రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆ సినిమా హిట్ అవ్వటంతో తెలుగులో వరుస అవకాశాలు దక్కించుకొని స్టార్ హీరోల సరసన నటించింది. ఇలా తెలుగు తమిళ్ కన్నడ భాషలలో స్టార్ హీరోల సరసన నటించి అతి తక్కువ కాలంలోనే సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. ఇలా సౌత్ ఇండస్ట్రీలో తన కెరీర్ మంచి పీక్స్ లో ఉన్న సమయంలో రకుల్ బాలీవుడ్ కి తన మఖాం మార్చేసింది.

బాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు దక్కించుకున్న ఈ అమ్మడు హిట్ మాత్రం అందుకోలేకపోయింది. అయినా కూడా బాలీవుడ్ సినిమాలలో తన నటనతో అక్కడికి ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంది. ఇక తాజాగా రకుల్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సాధారణంగా హీరో హీరోయిన్లు తమ ఫిట్నెస్ కాపాడుకోవటం కోసం ఎక్కువ సమయం జిమ్ లో వ్యాయామాలు చేస్తూ ఉంటారు. అయితే రకుల్ ప్రీత్ కూడా తన అందాన్ని కాపాడుకోవడం కోసం ఎక్కువ సమయం వర్కౌట్లు చేస్తూ వస్తోంది.

సినిమా ఆఫర్లు రోజురోజుకీ తగ్గిపోవడంతో అందం మీద దృష్టి పెట్టిన రకుల్ జీరో సైజ్ మెయింటైన్ చేయటం కోసం ఎక్కువ సమయం వ్యాయామాలు చేస్తూ డైట్ ఫాలో అవుతూ వస్తోంది. ఈ క్రమంలో ఈ అమ్మడు స్పృహ కోల్పోయి పడిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా అందం కోసం ఆరాటపడి అనారోగ్యం పాలైన రకుల్ ని అనే కుటుంబ సభ్యులు హాస్పిటల్ కి తీసుకెళ్లి చికిత్స చేయిస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇప్పటివరకు ఈ వార్తల గురించి రకుల్ ఎక్కడ స్పందించలేదు. ఈ వార్తలలో నిజం ఎంతుందో తెలియాలంటే రకుల్ కానీ ఆమె కుటుంబ సభ్యులు కానీ స్పందించాల్సి ఉంటుంది.