రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ కి టాటా.. షాకింగ్ డెసిషన్ తీసుకుంది అందుకే ..!

రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ రీసెంట్ గా రెండు సినిమాలు చేసింది. నాగార్జున తో మన్మధుడు 2 చేసిన తర్వాత ఘోరమైన పరాజయాన్ని అందుకుంది. దాంతో ఇక రకుల్ ప్రీత్ సింగ్ కి టాలీవుడ్ లో అవకాశాలు రావని అందరూ ఫిక్స్ అయ్యారు. కాని అనూహ్యంగా మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ – క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ దక్కించుకుంది. ఒకవైపు డ్రగ్స్ వ్యవహరంలో ఆరోపణలు ఎదుర్కొంటూనే ఈ సినిమా కంప్లీట్ చేసింది. కేవలం 45 రోజుల్లో ఈ సినిమా టాకీపార్ట్ కంప్లీట్ అవగా డీగ్లామర్ రోల్ లో రకుల్ నటించింది.

ఇక యంగ్ హీరో నితిన్ – చంద్ర శేఖర్ యేలేటి కాంబినేషన్ లో రూపొందిన చెక్ సినిమాలో ఒక హీరోయిన్ గా నటించింది. బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలలో అవకాశం అందుకున్న రకుల్ గ్యారెంటీగా ఈ రెండు సినిమాలతో మళ్ళీ ఫాంలోకి వచ్చి టాలీవుడ్ లో గట్టి పోటీ ఇవ్వబోతోంది. అభిమానులు కూడా రకుల్ మళ్ళీ టాలీవుడ్ లో స్టార్స్ తో సినిమాలు చేసి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారాలని ఆశిస్తున్నారు. ఈ నెలలోనే నితిన్ తో నటించిన చెక్ సినిమా రిలీజ్ కాబోతోంది. ఇక వైష్ణవ్ తేజ్ – క్రిష్ సినిమా కూడా త్వరలో రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఇప్పటి వరకు మళ్ళీ టాలీవుడ్ లో మరో సినిమా చేయలేదు.

కాని బాలీవుడ్ లో వరసగా క్రేజీ మూవీస్ చేస్తోంది. హిందీ సినిమాలతో చాలా బిజీగా ఉంది. దాంతో ఇప్పుడు పూర్తిగా ముంబై లోనే ఉండాలని డిసైడయిందని సమాచారం. కొన్ని నెలలు రకుల్ ప్రీత్ టాలీవుడ్ కి టాటా చెప్పాలనుకుంటుందట. ఇప్పటికే హిందీలో రెండు బాలీవుడ్ సినిమాల్లో నటిస్తోంది రకుల్. అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘మే డే’లో రకుల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. అమితాబ్ బచ్చన్ కీలకపాత్ర పోషిస్తున్నారు. అలాగే ‘థాంక్ గాడ్’ మూవీలోనూ నటిస్తోంది. లేటెస్ట్ గా ఆయుష్మాన్ ఖురానా తో రకుల్ ప్రీత్ సింగ్ ‘డాక్టర్ జీ’ అన్న టైటిల్ తో తెరకెక్కబోతున్న సినిమాకి సైన్ చేసింది.